ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ చైర్మన్గా నిడదవోలు నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే, టిడిపి ఇన్చార్జ్ బూరుగుపల్లి శేషారావు గురువారం తాడేపల్లిలోని స్కిల్ డెవలప్మెంట్ కార్యాలయంలో ప్రమాణస్వీకారం చేశారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చంనాయుడు బూరుగుపల్లి శేషారావుచే ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి నిడదవోలు నియోజకవర్గం నుండి వేలాది మంది నాయకులు, కార్యకర్తలు ర్యాలీగా బయలుదేరి తాడేపల్లి స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమంలో పాల్గొన్నారు. తమ అభిమాన నాయకునికి అత్యున్నత స్థాయి పదవి దక్కడంతో నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా బూరుగుపల్లి శేషారావు మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబునాయుడు ఆశీస్సులతో… రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఆధ్వర్యంలో రాష్ట్ర స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా అత్యున్నత ప్రమాణాలతో నైపుణ్యత కలిగిన యువతను తయారు చేయడమే లక్ష్యంగా పనిచేస్తానని అన్నారు. ఐటీ రోబోటిక్, నేనో టెక్నాలజీ, ఏ ఐ టెక్నాలజీ వంటి రంగాలలో సుశిక్షితులైన నిపుణుల అవసరాలు పెరిగాయని తధానుగుణంగా రాష్ట్ర యువతలో నైపుణ్యత పెంచడమే తమ సంస్థ లక్ష్యమని ఆయన అన్నారు.
ఈ సందర్భంగా స్కిల్ డెవలప్మెంట్ చైర్మన్ రాష్ట్ర పర్యాటక సినీమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్, గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు, ఎస్సీ కమిషన్ చైర్మన్ కె.ఎస్ జవహర్, శశి విద్యాసంస్థల చైర్మన్ బూరుగుపల్లి వేణుగోపాలకృష్ణ, రాష్ట్ర పౌల్ట్రీ ఫెడరేషన్ అధ్యక్షులు కోమట్లపల్లి వెంకట సుబ్బారావు, పౌల్ట్రీ ఫెడరేషన్ బోర్డు సభ్యులు ఉండ్రాజవరం గ్రామ మాజీ సర్పంచ్ గన్నమని వెంకట సుబ్రహ్మణ్యం, ఉండ్రాజవరం మండలం టిడిపి అధ్యక్షులు సింహాద్రి రామకృష్ణ, రాజమండ్రి పార్లమెంట్ టిడిపి ఉపాధ్యక్షులు రాచమల్ల శ్రీనివాసరావు, వేలివెన్ను గ్రామ ఉపసర్పంచ్ బూరుగుపల్లి శ్రీనివాసరావు, నియోజకవర్గంలో వివిధ గ్రామాల సర్పంచులు ఎంపీటీసీలు వార్డు మెంబర్లు, కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.