దేశంలోనే అతి పెద్ద సంక్షేమ కార్యక్రమం ఎన్టీఆర్ భరోసా పింఛన్లు
- నెలకు రూ.2,750 కోట్లు పింఛన్ల కోసం ఖర్చు
- రూ.4 వేలు వృద్ధాప్య, వితంతు పెన్షన్
- రూ.6 వేలు దివ్యాంగ పెన్షన్
- రూ.10 వేలు డయాలసిస్ రోగులకు
- రూ. 15 వేలు మంచానికి పరిమితమైన వారికి
కొవ్వూరు నియోజకవర్గం మలకపల్లిలో పేదల సేవలో కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. సానమాండ్ర పోశిబాబు ఇంటికి వెళ్లి డప్పులు, చెప్పుల తయారీ గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం చర్మకార పింఛను అందజేశారు.