తణుకు రోటరీక్లబ్ లో ఆదివారం జరిగిన ప్రాంతీయ సమావేశములో మానవత వ్యవస్థాపకులు ఎన్. రామచంద్రారెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేసి, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని తణుకు, తాడేపల్లిగూడెం, ఉండ్రాజవరం, నిడదవోలు, చాగల్లు, అత్తిలి, భీమవరం, పెనుగొండ, పెనుమంట్ర, ఆచంట, పాలకొల్లు మండలాల మానవత శాఖలు ఆశయాలకు అనుగుణంగా సమర్ధవంతంగా చేస్తున్న సేవా కార్యక్రమాలు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వివిధ శాఖలకు ఆదర్శంగా, దిశనిర్దేశం చేసేలాగా ఉన్నాయని అభినందించారు. కడప జిల్లా సెంట్రల్ కమిటీ చైర్మన్ ఎ. రామాంజులరెడ్డి మాట్లాడుతూ మానవత చేస్తున్న సేవలు ప్రజలలో స్థిరంగా నాటుకునే విధంగా ఉండాలని, సూచించారు.
ఈ కార్యక్రమంలో తణుకు పట్టణ ప్రముఖులు చిట్టూరి అచ్యుత రామ ప్రసాద్ జ్ఞాపకార్ధం సతీమణి శ్రీమతి సుజాత మానవత సేవా కార్యక్రమములకు ప్రతి సంవత్సరం రూ. 2,00,000/-లు (రెండు లక్షల రూపాయలు) విరాళం ప్రకటించారు. గతంలో మానవత ద్వారా ప్రతిభా పురస్కారం పొందిన, అమెరికా లో ఉద్యోగం చేస్తున్న జి. సాయి ఉత్తేజ్, తణుకు మానవత శాఖకు సేవా కార్యక్రమాల నిమిత్తం రూ.50,000/-లు విరాళం అందజేశారు.
మానవత వ్యవస్థాపకులు ఎన్. రామచంద్రారెడ్డి సూచన మేరకు, ప్రతిభ కలిగిన విద్యార్థులకు అందజేయు, ప్రతిభా పురస్కారాలలో భాగంగా,
1.కుమారి గుర్రాల జయలక్ష్మి, 2.పట్టెం జగదీష్, 3.జి. శ్రీ హర్షిత లకు ఒక్కొక్కరికి
రూ.10,000/-లు చొప్పున,
4.లంక గౌతమ్ సాయి కి
రూ.25,000/-లు అందజేయడమైనది.
జిల్లా, రీజియన్ కన్వీనర్ శ్రీమతి బోయపాటి రామలక్ష్మిని, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ప్రతిభా పురస్కారముల కమిటీ చైర్మన్ గా ప్రకటించడమైనది. ఈ సందర్భంగా అందరు వారికి అభినందనలు తెలియజేసారు. ఈ కార్యక్రమంలో జిల్లా శాంతి ర్యాలీ చైర్మన్ గమిని రాంబాబు, జిల్లా అధ్యక్షులు దేవినేని భాస్కరరావు, సెంట్రల్ కమిటీ చైర్మన్ ఆలపాటి నాగేశ్వరరావు, తణుకు శాఖ అధ్యక్షులు శ్రీమతి కఠారి శారదాదేవి తదితర మానవత సభ్యులు, అతిథిలు, ఆహ్వానితులు పాల్గొన్నారు.
