ఉండ్రాజవరం మండలం పంచాయతీ కార్యదర్శుల కార్యవర్గ సమావేశం శనివారం జరిగింది. ఈ సందర్భంగా మండలంలోని అన్ని గ్రామాల పంచాయతీ సెక్రటరీల ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో మండల పంచాయతీ కార్యవర్గాన్ని ఎన్నుకోవడం జరిగింది. గౌరవ అధ్యక్షులుగా చివటం గ్రామకార్యదర్శి గంపర్తి వీర వెంకట సత్యనారాయణ, అధ్యక్షులుగా పాలంగి గ్రామకార్యదర్శి మహమ్మద్ హాసన్ జానీ, ఉపాధ్యక్షులుగా కాల్దరి గ్రామకార్యదర్శి వంగా శ్రీనివాస్, కార్యదర్శిగా చిలకపాడు గ్రామకార్యదర్శి చోళ్ల రాజు, కోశాధికారిగా వడ్లూరు గ్రామకార్యదర్శి తిప్పాని రాజకుమార్, ఎన్నుకోబడ్డారు. అదేవిధంగా మహిళ సంయుక్త కార్యదర్శిగా టీ. బాలా త్రిపుర సుందరి ఎన్నుకోబడగా సదరు కార్యక్రమంలో ఎన్నిక కాబడిన నూతన సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వేలివెన్ను గ్రామకార్యదర్శి పి.శేషుబాబు, తాడిపర్రు గ్రామకార్యదర్శి పి.ముసలయ్య, ఉండ్రాజవరం గ్రామ కార్యదర్శి యు.ముత్యాలనాగ్, సత్యవాడ గ్రామకార్యదర్శి జి. ప్రసాదరావు, పసలపూడి గ్రామ కార్యదర్శి అంగర శ్రీనివాస్, కే. సావరం గ్రామకార్యదర్శి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

