తణుకు పట్టణంలో వైస్సార్సీపీ కార్యాలయంలో మీడియా సమావేశంలో ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ పై మండి పడ్డ మాజీ మంత్రి కారుమూరి
నిన్నటి రోజున మీడియా సమావేశం నిర్వహించి పచ్చి అబద్దాలాడిన ఎమ్మెల్యే ఆరిమిల్లి
తేతలిలో నిర్వహిస్తున్న పశువధ ఫ్యాక్టరీకి గత వైస్సార్సీపీ హయాంలో నే అనుమతులు ఇచ్చారంటూ అబద్దాలాడిన ఎమ్మెల్యే ఆరిమిల్లి
నాహయాంలోనే పర్మిషన్లు ఇచ్చి ఉంటె ఆ ఐదు సంవత్సరాల్లో ఒక్క పశువు కూడా ఎందుకు వద జరగలేదు
ఈరెండు నెలల నుండే ఎందుకు రోజూ వందల పశువులు, గోవులు వదిస్తున్నారు.
ఫ్యాక్టరీ పక్కన గోడౌన్లలో పని చేసే జట్టు కూలీల చేత సాక్షాలు చెప్పించిన మాజీ మంత్రి కారుమూరి
గత ఐదేళ్లు పశువధ ఫ్యాక్టరీ ఒక్క రోజు కూడా నడవలేదని చెప్పిన హమాలీ జట్టు కూలీలు
రెండు నెలలుగా తాము అక్కడ పని చేయలేక పోతున్నామని వాసనతో తిండి తినలేక పోతున్నామని గొల్లుమన్న కార్మికులు, ఇక్కడ ఎమ్మెల్యే అరిమిల్లికి డబ్బే ప్రధానమైతే అందరం చందాలు పోగేసి ఇస్తామన్న మాజీ మంత్రి కారుమూరి
పేపర్స్ లో 34 ఎకరాల్లో ఫ్యాక్టరీ ఉన్నట్లు తప్పుడు పత్రాలు చూపిస్తున్నారు
కానీ ఫ్యాక్టరీ మూడెకరాల 29 సెంట్లు లో మాత్రమే జనావాసాల మధ్య ఉంది ఈఒక్క కారణం చాలు అది మూయించటానికి
కానీ ఇక్కడి ప్రజల ఆరోగ్యం ప్రాణాలకంటే ఉత్తర్ ప్రదేశ్ కసాయి వ్యాపిరి ఎక్కువైపోయాడు ఎమ్మెల్యేకి
ఎమ్మెల్యే ఆరిమిల్లి డైవర్షన్ పాలిటిక్స్ మాట్లాడుతున్నాడు
అసలు పశువధ ను ఆపించే దమ్ము ఉందా లేదా సూటిగా ప్రశ్నించిన మాజీ మంత్రి కారుమూరి ప్రజలంతా ఏకమై ఉద్యమాలు చేయటానికి సిద్ధంగా ఉన్నారు
అనుమతులు లేని ఫ్యాక్టరీకి పోలీస్ లతో కాపలా కాయిస్తావా…. ఎమ్మెల్యే గారు మీకు ధన దాహం ఉంటే చెప్పండి.. మేమందరం చందాలు వేసుకొని మీకు ఇస్తాం
ఎమ్మెల్యే గారు నేను జోలు పట్టుకొని అడుక్కుని వచ్చి మీకు ఇస్తాం ఫ్యాక్టరీని ఆపించండి
లేహం ఫ్యాక్టరీ యాజమాన్యం పడేసే గడ్డికి కక్కుర్తి పడుతున్నారా..