తణుకు పట్టణంలో చట్ట వ్యతిరేకంగా మరియు గౌరవ రాష్ట్ర ఉన్నత న్యాయ స్థానం స్టే ను దిక్కరిస్తూ, లాహం ఫుడ్స్ ప్రొడక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ వధశాలను నిర్వహిస్తూ తణుకు పట్టణ ప్రజానీకానికి, పరిసర గ్రామాల ప్రజలకు తీవ్ర ఆశ్వస్థత రగులుస్తూ, పాడి పంటలకు ఉపయోగపడే గోజాతిని, భావి తరాల భవిషత్ను అంధకారంలోకి నేడుతు, పర్యావరణాన్ని అన్నిరకాలుగా కలుషితం చేస్తూ, పచ్చని గోదావరి పరివాహక ప్రాంతం అంతటిని నాశనం చేయు సంకల్పంతో ఉన్న ఆ కబేలా యాజమాన్యానికి కోమ్ము కాస్తూ, మా ప్రాంతానికి దారుణమైన ద్రోహం, అనాయ్యం చేస్తూ, విధినిర్వహణలొ భేషజాలు చూపుతూ, నిర్లప్తత, ఉద్దాసీనంగ వ్యవహారిస్తూ, ప్రజా సేవకులు అనే అర్ధాన్నే గుర్తేరుగకుండా దేశ ద్రోహులుగా వ్యవహరిస్తూ ఉన్న గ్రామస్థాయి నుండి జిల్లా అధికారుల వైకరిని ఉప-ముఖ్యమంత్రి కొణిదల పవన్ కళ్యాణ్ ద్రుష్టికి తీసుకువెళ్ళడానికి తణుకు పట్టణం నుండి మేమంతా వచ్చి ఆయన నిర్వహిస్తున్న శాఖలు అయిన పంచాయతీరాజ్ మరియు పర్యావరణ శాఖల విషయాలను తెలియజేయాలని శంకల్పించి వచ్చాము. ఉపముఖ్యమంత్రి అందుబాటులో లేనప్పటికి వారి సిబ్బంది మా సమస్యను సవివరముగు అడిగి మా అభ్యర్ధననూ , సంబంధిత ఆధార పత్రాలనూ స్వీకరించి పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకు వెళ్తామని హామీ ఇచ్చారు.
పవన్ కళ్యాణ్ మాకు ఆ అక్రమ కబెలాను శాశ్వతముగా తొలగించి మాకు నాయ్యం చేస్తారనే దృఢ విశ్వాసముతో ఎదురుచూస్తున్నామని భాదితులు తెలిపారు.
