తణుకు నియోజకవర్గంలో తణుకు మండలం మండపాక, అత్తిలి మండలం వరిగేడు, ఇరగవరం మండలం రేలంగి గ్రామంలో గోకులం షెడ్లను ప్రారంభించిన తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ, ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జాతీయ ఉపాధి హామీ పథకం ద్వారా రైతులకు సంబంధించి పశువుల షెడ్లు 4 పశువులు ,మరియు 6 పశువులు నిర్మాణానికి 1,85,000 మరియు 2,40,000 వేల రూపాయలు కేటగిరీలలో పశువుల షెడ్డు ల నిర్మాణానికి నిధులు కేటాయించడం జరిగిందని అన్నారు.దానిలో భాగంగా తణుకు నియోజకవర్గంలో 112 పశువుల షెడ్లు శాంక్షన్ అయ్యి వాటి నిర్మాణాలు అన్నీ కూడా పూర్తి చేసుకుని ఈరోజు ప్రారంభోత్సవం చేశారు, సందర్భంగా రైతులందరూ చాలా ఆనందంగా ఉన్నారని అన్నారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ డిపార్ట్మెంట్ సంబంధించి ఆయన ఇచ్చినటు వంటి ఆదేశాలమేరకు ఈ షెడ్లన్నీ కూడా నిర్మాణాలు పూర్తిచేసుకొని సంక్రాంతి పండుగకు ప్రారంభోత్సవం చేయాలని ఆదేశాల మేరకు దానికి అనుగుణంగా వీటిని నియోజకవర్గంలో రైతులందరూ కూడా ప్రారంభోత్సవం చేయడం జరిగిందని అన్నారు. వరిగగేడు గ్రామము మండపాక గ్రామము, ఇరగవరం మండలం రేలంగి గ్రామంలో ఈ యొక్క పశువుల షెడ్లు నిర్మాణాలను పూర్తి చేసుకొని పశువుల షెడ్లను ప్రారంభించామని దానిలో భాగంగా నాలుగు పశువుల ఉన్న షెడ్లకు 10 శాతం కంట్రిబ్యూషన్ ఉంటుందని మిగిలినది ఖర్చు అంత ప్రభుత్వం బరాయిస్తుందని అన్నారు. ఈ సందర్భంగా రైతులందరూ చాలా ఆనందంగా ఉన్నారని ఈ ప్రభుత్వం వారికి అందిస్తున్న సహకారానికి వారు ధన్యవాదాలు తెలిపారని అన్నారు. ఎన్ఆర్జిఎస్ పథకం ద్వారా గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబునాయుడు, పవన్ కళ్యాణ్ ఆదేశాలమేరకు పనిదినాలు పెంచే విధంగా వివిధ దశలలో ఉపయోగించుకోవడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, ప్రభుత్వ సిబ్బంది మరియు రైతులు పాల్గొన్నారు.
