తణుకులో ప్రముఖ స్వతంత్ర సమరయోధుడు సంఘసంస్కర్త, త్రిపురనేని రామస్వామి చౌదరి జయంతినీ బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బ్యాంకు కాలనీ వద్ద ఉన్న స్వతంత్ర సమరయోధులు పార్కులో ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో తణుకు సీనియర్ సిటిజన్స్ సంఘ సభ్యులు, తదితరులు పాల్గొని ఆయన చేసిన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో సీనియర్ సిటిజన్ అసోసియేషన్ సభ్యులు కోడూరి ఆంజనేయులు, ఆకేళ్ళ సుబ్రహ్మణ్యం, కౌరు వెంకటేశ్వర్లు, పేరూరి మురళికుమార్, అక్కిన కాశీవిశ్వేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
