గోదావరి జిల్లా సంక్రాంతి ఉత్సవాలలో హైదరాబాద్ ఎమ్మెల్యే

ఆంధ్రుల ప్రత్యేక పండుగ సంక్రాంతి ఉత్సవాలలో భాగంగా తూర్పుగోదావరి జిల్లా కే.సావరం గ్రామంలో నిర్వహిస్తున్న శ్రీ శ్రీ ముత్యాలమ్మ తల్లి అమ్మవారి జాతర మహోత్సవాలలో హైదరాబాద్ కూకట్ పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు మంగళవారం ముఖ్యఅతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయనకు కమిటీ సభ్యులు స్వాగతం పలుకగా, అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా మాధవరం కృష్ణారావు మాట్లాడుతూ ఆంధ్ర ప్రదేశ్లో సంక్రాంతి ఉత్సవాలు అత్యంత వైభవంగా జరుపుతారని, వాటిలో తాను పాల్గొనడం ఎంతో ఆనందాన్నిచ్చిందని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ నార్ని రామకృష్ణ, జిల్లా బిజెపి అధ్యక్షుడు నార్ని తాతాజీ, ఉత్సవ కమిటీ సభ్యులు పోలిశెట్టి నాగ రామారావు, మీసాల సురేష్, పోలిశెట్టి వీరాస్వామి తదితరులు పాల్గొన్నారు.

Scroll to Top
Share via
Copy link