ఫ్లెమింగో ఫెస్టివల్- 2025 పక్షుల పండుగ కార్యక్రమాన్ని అట్టహాసంగా సూళ్లూరుపేట లోని హోలీ క్రాస్ సర్కిల్ నుండి ర్యాలీగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక మరియు సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్, స్థానిక ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ, జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్.వెంకటేశ్వర్, జెసి శుభం బన్సల్, ఆర్డీ టూరిజం రమణప్రసాద్ తదితర అధికారులు, ప్రజాప్రతినిధులతో కలిసి పాల్గొని పలు కళారూపాల విన్యాసాల ప్రదర్శనతో, మేళతాళాల నడుమ ఫ్లెమింగో ఫెస్టివల్ 2025 కార్యక్రమం జరగనున్న జూనియర్ కళాశాల ప్రాంగణానికి చేరుకుని ప్రారంభించారు.
అనంతరం జూనియర్ కళాశాల ప్రాంగణంలో ఫ్లెమింగో ఫెస్టివల్ 2025 సందర్భముగా ఏర్పాటుచేసిన వివిధ శాఖలకు చెందిన ఎగ్జిబిషన్ స్టాల్స్, ఇన్ఫర్మేషన్ సెంటర్, మెడికల్ క్యాంప్, హార్టికల్చర్, అగ్రికల్చర్, అటవీ శాఖ, జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ తిరుపతి, ఆప్కో, చేనేత, హ్యాండీక్రాఫ్ట్స్ కలంకారి, ఐసిడిఎస్ అంగన్వాడి కేంద్రాలు, పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ, శిల్పారామం, షార్ అంతరిక్ష కేంద్రం నమూనా స్టాల్, శ్రీ సిటీ పరిశ్రమలకు సంబంధించిన స్టాల్, స్టేట్ బ్యాంక్ మరియు అనుబంధ సంస్థ బ్యాంకులు, పర్యాటకశాఖ వారి ఫుడ్ కోర్ట్, వీనస్ వారి ఉచిత వైద్య శిబిరం, బ్రహ్మకుమారిస్ వారి మెడిటేషన్ సెంటర్ మరియు స్థానికంగా ఏర్పాటుచేసిన వంటశాలలు, ఫుడ్ కోఆర్ట్స్ లను, పశు సంవర్థక శాఖ తదితర స్టాళ్లను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక మరియు సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేశ్, ఎంఎల్ఏ నెలవల విజయ శ్రీ, కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్, మాజీ మంత్రి పరశా రత్నం, మాజీ ఎమ్మెల్సీ వాకాటి నారాయణ రెడ్డి తదితరులతో కలిసి ప్రారంభించారు.
ప్రాంగణంలో ఏర్పాటు చేసిన షార్ అంతరిక్ష పరిశోధన కేంద్రం నమూనా స్టాల్, శ్రీ సిటీ స్టాల్ పలువురిని ఎంతగానో ఆకట్టుకున్నాయి.. అంతేగాక విభిన్న వేషధారణలు పలువురిని ఆకట్టుకున్నాయి..
తొలుత గోపూజ చేసిన అనంతరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక, సాంకృతిక మరియు సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ ప్లెమింగో ఫెస్టివల్ ను ప్రారంభించారు..
