పేదల పొట్టను కొట్టే బడ్జెట్ అని సిపిఎం పార్టీ ఇరగవరం మండల కన్వీనర్ కామన మునుస్వామి అన్నారు. కేంద్రప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ కు నిరసనగా సోమవారం నాడు ఇరగవరం మండల తహశీల్దార్ కార్యాలయం ముందు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో నిరసన తెలియజేశారు.
ఈ సందర్భంగా కామన మునిస్వామి మాట్లాడుతూ కేంద్రప్రభుత్వము ప్రవేశపెట్టిన బడ్జెట్ కార్పెట్లకు, పెట్టుబడిదారులకు అనుకూలమైన దేనిని అన్నారు. దేశంలోని పేద ప్రజలను, మహిళలను, యువకులను, రైతులను ఈ బడ్జెట్ లో మరిచారని అన్నారు. బిజెపి అధికారంలోకి వచ్చిన నాటి నుంచి దేశంలో ఒక లక్ష 30 వేల మంది రైతులు ఆత్మహత్య చేసుకుంటే బడ్జెట్లో రైతులకు 4000 కోట్లు రూపాయలు కోత విధించడం దుర్మార్గమైన చర్యని మునిస్వామి అన్నారు. ప్రభుత్వరంగ సంస్థల నుంచి 47 వేల కోట్ల రూపాయలను ప్రైవేటు, కార్పొరేటు వ్యక్తులకు మార్చడం దుర్మార్గమైన చర్యని అన్యాయమని అన్నారు. దేశంలో పెరుగుతున్న నిత్యవసర వస్తువుల ధరలు గురించి మాట్లాడడం గానీ ప్రత్యామ్నయాలు ఏర్పాట్లు గురించి ఆలోచించడం గానీ లేకుండా ఆదాయ పన్ను 12 లక్షలకు పెంచాము మధ్యతరగతి వారికి పోరాటం, ఊరట కలిగించామని చెప్పడం దెయ్యాలకు వేదాలు నేర్పడమన్నారు .ఈ బడ్జెట్లో ఆంధ్రప్రదేశ ఒకరు పైసా కూడా కేటాయించ పోవడం విచారకరo అన్నారు. గతంలో ఉన్న ఉక్కుఫ్యాక్టరీ నిధులను 8,300 నుంచి 3,500వేలకు తగ్గించడం విశాఖ ఉక్కుఫ్యాక్టరీ ని అమ్మివేయడమేని అన్నారు. పోలవరం ప్రాజెక్టు నిరాశషులకు ఒక్క రూపాయి కూడా విడుదల చేయకపోవడం బడ్జెట్లో ఇవ్వకపోవడం బిజెపి పక్షపాత ధోరణి అన్నారు. విశాఖ రైల్వే జోన్ గురించి గానీ ఉక్కు ఫ్యాక్టరీ కడప ఉక్కు పరిశ్రమ అంశాలు ఏమీ కూడా బడ్జెట్లో ప్రతిపాదించకపోవడం ఆంధ్రప్రదేశ్ పట్ల వ్యతిరేక కనిపిస్తుందని మునిస్వామి అన్నారు. వెంటనే బడ్జెట్ ద్వారా ఆంధ్రప్రదేశ్ కు నిధులు కేటాయించాలని సిపిఎం పార్టీ డిమాండ్ చేసినది, లేనిపక్షంలో ప్రజలతో సిపిఎం పార్టీ ఉద్యమాన్ని చేపడతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ సభ్యులు జిత్తిగా రామాంజనేయులు, గుబ్బల ముత్యాలు, పెచేటి సుబ్బారావు, పిల్లి కోటేశ్వరరావు, బొంత నాగబాబు తదితరులు పాల్గొన్నారు.
