కేంద్ర బడ్జెట్ కు వ్యతిరేకంగా దేశవ్యాప్త ఆందోళనలో భాగంగా భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ (ఎం) కేంద్ర కమిటీ ఇచ్చిన పిలుపుతో సిపిఎం పార్టీ పెనుగొండ మండల కమిటీ ఆధ్వర్యంలో గాంధీ బొమ్మల సెంటర్ వద్ద మంగళవారం జరిగిన నిరసన కార్యక్రమంలో పెనుగొండ మండల కార్యదర్శి షేక్ పాదుషా మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 2025-26 బడ్జెట్ లోనూ సామాన్యుల పై భారాలు, సంపన్నులకు వరాలు కురిపించారని కేంద్ర ప్రభుత్వాన్నిఎద్దేవాచేశారు. ఈ బడ్జెట్ పేద, మధ్యతరగతి ప్రజలను దోచి కార్పోరేట్ లకు పంచి పెట్టే విధంగా ఉందని అన్నారు.50,65,345 కోట్ల రూపాయల బడ్జెట్ లో అధికభాగం కార్పొరేట్ల వైపే మొగ్గు చూపారని ఆయన అన్నారు. విభజన చట్టప్రకారం వచ్చిన ఏ జాతీయ విద్యాసంస్థలకు కేటాయింపులు చేయలేదని, విశాఖ రైల్వే జోన్, విశాఖ స్టీల్ ప్లాంట్, కడప స్టీల్ ప్లాంట్, వైజాగ్ మెట్రో, నిరుద్యోగులకు ఉద్యోగాలు ఊసే లేదని, వ్యవసాయ రంగానికి నిధులు కేటాయించలేదని, ఆక్వా రంగానికి నిధులు కేటాయించలేదని,గ్రామీణ ఉపాధిహామీ పథకానికి నిధులు కేటాయించలేదని,రాజధాని నిర్మాణానికి ఆంధ్రప్రదేశ్ కు ఈసారి కూడా కేటాయింపుల్లో తీరని ద్రోహం జరిగిందని వారు అన్నారు. అయినా తెలుగుదేశం కూటం ప్రభుత్వం బడ్జెట్ బాగుందని మెచ్చుకోవటం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యులు ఎస్ వెంకటేశ్వరరావు, మండల పార్టీ కమిటీ సభ్యులు నాగిశెట్టి గంగారావు, నీలాపు ఆదినారాయణ, రాజమహేంద్రవరపు వెంకటేష్, గుడిమెట్ల వరహాల రెడ్డి ప్రజలు పాల్గొన్నారు.
