వేధింపులతో పని చేయలేను … నావల్ల కావటంలేదు… స్నేహితుడితో ఆత్మహత్య చేసుకున్న తణుకు రూరల్ ఎస్సై ఏ.జి.ఎస్.మూర్తి చివరి మాటలు

వేధింపులతో పని చేయలేను … నావల్ల కావటంలేదు… స్నేహితుడితో ఆత్మహత్య చేసుకున్న తణుకు రూరల్ ఎస్సై ఏ.జి.ఎస్.మూర్తి చివరి మాటలు… ఆ ఇద్దరు అధికారుల ఒత్తిడితోనే ఇంతటి అఘాయిత్యానికి పాల్పడినట్లు…. స్నేహితుడితో ఫోన్లో మాట్లాడిన కీలక విషయాలు సోషల్ మీడియాలో వైరల్ : ఈ నెల ఒకటవ తేదీ పశ్చిమగోదావరి జిల్లా తణుకు రూరల్ ఎస్సైగా పనిచేసిన ఆదుర్తి గంగ సత్యనారాయణమూర్తి ఆత్మహత్య రాష్ట్రవ్యాప్తంగా సంచలనం కలిగించిన విషయం తెలిసిందే… సోషల్ మీడియాలో స్నేహితుడితో ఎస్సై మూర్తి చివరిగా మాట్లాడిన మాటలు ఈ ఆత్మహత్య వ్యవహారంలో కొత్త కోణాలు వెలుగుచూస్తున్నాయి. పోలీసు ఉన్నతాధికారుల వేధింపుల వల్లే వి.ఆర్. లో ఉన్న ఎస్సై మూర్తి ఆత్మహత్య చేసుకున్నారని, చివరిగా తన స్నేహితుడితో మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో రెండు రోజులుగా వైరల్ అవుతున్నాయి. ఎస్సై మూర్తి తనకు జరిగిన అన్యాయం గురించి స్నేహితుని వద్ద తీవ్ర మనోవేదన చెందినట్లు భార్య పిల్లల గురించి ఆందోళన వ్యక్తం చేస్తున్నట్లు తెలిసింది. ఇక్కడ గతంలో పనిచేసిన సిఐ నాగేశ్వరరావు మరో సిఐ తనను పెట్టిన ఇబ్బందుల వల్లే తాను పనిచేయలేనని అన్నట్లు స్నేహితుడితో మాట్లాడిన ఆడియోలో ఉంది. వి ఆర్ నుండి పోస్టింగ్ ఇచ్చిన కృష్ణా జిల్లాలో ఇస్తామని అంటున్నారని అక్కడ తాను ఉద్యోగం చేయలేనని తూర్పుగోదావరి జిల్లాలో అడుగుతుండగా ఇక్కడ ఇచ్చే అవకాశం లేదని తన స్నేహితునితో అన్నట్లు తెలుస్తుంది. తాను తీవ్ర మనోవేదనకు గురవుతున్నానని ఈ పరిస్థితుల్లో ఆత్మహత్య తప్ప మరో మార్గం లేదని అన్నారు. ఈ సందర్భంలో మూర్తి స్నేహితుడు అటువంటి ఆలోచనలు మనసులో రానివద్దని, భార్య పిల్లల గురించి అయినా ఆలోచించాలని కోరారు. మూర్తి మృతి చెందిన అనంతరం ఆయన బంధువులు ఆయనతో పనిచేసిన తోటి ఎస్సైలు మిత్రులు తనకు రూరల్ పోలీస్ స్టేషన్ వద్ద జిల్లా ఎస్పీ వద్ద ఈ వ్యవహారం పై పూర్తి విచారణ జరిపి భార్య పిల్లలకు న్యాయం చేయాలని కోరారు.

Scroll to Top
Share via
Copy link