ప్రపంచ కేన్సర్ దినోత్సవం సందర్భంగా అవగాహన సదస్సును మంగళవారం ఉండ్రాజవరం ప్రాధమిక ఆరోగ్య కేంద్రంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్యాధికారి డా.ఆర్. ఉషాదేవి మాట్లాడుతూ, సమాజంలో అందరికీ కేన్సర్ వ్యాధి అనుమానిత లక్షణాలు తెలియచేస్తూ, ముందుగానే నోటి కేన్సర్, గర్భాశయ కేన్సర్, బ్రెస్ట్ కేన్సర్ లను ముందుగానే గుర్తించి, సత్వర చికిత్స అందించటం వలన, వారిని కేన్సర్ వ్యాధి నుండి పూర్తిగా స్వస్థత పొందేటట్లు చేయవచ్చునని తెలియ చేశారు. ఇప్పుడు గ్రామాల్లో చేస్తున్న NCD- CD సర్వేలో కేన్సర్ లక్షణాలు గల వ్యక్తులను గుర్తిస్తే, వారిని వ్యాధి నిర్ధారణ కొరకు, రాజమండ్రి జనరల్ హాస్పిటల్ లో కేన్సర్ స్పెషలిస్ట్ డాక్టర్ చే, వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేయించి, కాన్సర్ ఉన్నది అని నిర్ధారణ అయితే, తదుపరి చికిత్స కూడా ఉచితంగా ప్రభుత్వమే ఉచితంగా వైద్యం చేయిస్తుందని ఈ సందర్భంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో సి.హెచ్.ఓ సుబ్రహ్మణ్యం, పి.హెచ్.ఎన్ శ్రీమతి కె.డి.వి.ఎల్. కుమారి, హెల్త్ సూపర్వైజర్ శ్రీ జె. శ్రీనివాసరావు, ఎం.ఎల్.హెచ్.పి లు, ఏ. ఎన్. ఎం లు, ఆశ కార్యకర్తలు పాల్గొన్నారు.
