విద్యార్థులలో సాంకేతిక అంశాల పట్ల అవగాహన కలిగిఉండాలి

విద్యార్థులలో సాంకేతిక అంశాల పట్ల అవగాహన కలిగించినప్పుడే సరియైన అవగాహన కలిగి చదువులో నేర్చుకుంటున్నటువంటి వివిధ క్లిష్టమైనటువంటి సాంకేతిక విషయల పట్ల అవగాహన కలుగుతుందని అందువల్ల విద్యార్థి దశలో ఈ విధమైన స్టడీ టూర్లు విద్యాబోధన ద్వాదపడతాయని ఉండ్రాజవరం MVN ZPHSCHOOL ప్రధానోపాధ్యాయులు శ్రీ కె ఎస్ కే మాణిక్యాలరావు తెలిపారు. శుక్రవారం ఉదయం పాఠశాల విద్యార్థులు స్టడీ టూర్ లో భాగంగా పెరవలి మండలం లో ఉన్నటువంటి శ్రీ రవళి స్పిన్నింగ్ సాంకేతిక విజ్ఞానాన్ని పరిశ్రమలను సందర్శించడానికి విద్యా పాఠశాల 9వ తరగతి విద్యార్థులు తీసుకెళ్లడం జరిగింది ఈ స్టడీ టూర్ వల్ల విద్యార్థులకు ప్రతి నుండి దారం ఏ విధంగా తయారవుతుందో తద్వారా మనం ధరించేటువంటి వస్త్రాలకు ఈ దారాలు ఏవిధంగా దోహాలు పడతాయో అవగాహన కలిగించడం చాలా సంతోషదాయకమని ఇది విద్యార్థులకు ఎంతగానో ఉపయోగపడుతుందని తెలిపారు ఉదయం 9 గంటలకి రవళి స్పిన్నింగ్ మిల్ ఫ్యాక్టరీకి వీళ్ళని విద్యార్థులు ఈ ఫ్యాక్టరీలో ప్రతి దశను ఈ పరిశ్రమకు చెందిన ఉన్నతాధికారి వీరస్వామి గారు సోదాహరణగా విద్యార్థులకు వివరించి ప్రతి పంట ద్వారా లభించినటువంటి దూదిని సేకరించి దాని నుండి రకరకాల వడపోతల ద్వారా దారానికి అనువైనటువంటి దూదిని తయారుచేసి ఆ దూది ద్వారా దారాలను వడకట్టడం జరుగుతుంది ఇవి వస్త్ర పరిశ్రమకు ఈ దారాల పంపించి అనంతరం బట్టలు గా తయారు చేయడానికి ఈ దారాలు గురించీ విద్యార్థులకు వివరించారు. ఈ పారిశ్రామిక పర్యటనలో పాఠశాల విద్యార్థులు సుమారు వందమంది పాల్గొన్నారు. ఈ స్టడీ టూర్ లో దాదాపు 100 మంది పాఠశాల విద్యార్థులు పాల్గొన్నారు ఈ పర్యటన కు ఒకేషనల్ విద్యార్థులు ఉపాధ్యాయుడు శ్రీనివాస్ సారధ్యం వహించారు అలాగే ఒకేషనల్ ఉపాధ్యాయుని పాఠశాల సీనియర్ ఉపాధ్యాయులు శ్రీ భాస్కర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Scroll to Top
Share via
Copy link