మహాశివరాత్రి ఉత్సవాల సందర్భంగా ఉండ్రాజవరం మండలం పాలంగి గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో నిర్వహిస్తున్న మహాశివరాత్రి ఉత్సవాలకు నిడదవోలు నియోజకవర్గం మాజీ శాసనసభ్యులు తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ బూరుగుపల్లి శేషారావు ను ఉత్సవ కమిటీ సభ్యులు కలసి ఆహ్వాన పత్రికను అందజేశారు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ పాలంగి గ్రామ అధ్యక్షులు ఈడుపుగంటి ఉదయ్ కుమార్ (భాను) పశ్చిమగోదావరి జిల్లా బిసి సంఘం నాయకులు కేతా మాణిక్యాలరావు, చిడి పోతు సింహాచలం, పినిశెట్టి రామకృష్ణ, కేతా రామారావు, కొమ్మర చంటి, కేతిన బ్రహ్మన్న కడిమి మణికంఠ, చెల్లంకి తమ్మారావు, తదితరులు ఆయనను కలిసి మహాశివరాత్రి ఉత్సవాలకు ఆహ్వానించారు.
