జ్ఞానాపురంలో శివరాత్రి నాడు ఉత్సాకరంగా ఆటపాటలు
విశాఖలో శివరాత్రి నాడు ఎంతో ప్రతిష్టాత్మకమైన శైవ క్షేత్రాలలో ప్రతి భక్తుడు గుండెలో శివనామ స్వరాలతో నిండిపోయింది. జ్ఞానపురం 41 వార్డులో టీడీపీ వార్డు వైస్ ప్రెసిడెంట్ ఐతి రవి బాబు ఆధ్వర్యంలో శివరాత్రి నాడు రాత్రి స్థానికులచే ఆటపాటలాడిస్తూ ఎంతో ఉత్సాహకరంగా రాత్రి జాగారాలు చేసారు. ఈ ఆటపాటలలో గెలుపొందిన వారికి బహుమతుల ప్రధానోత్సవ కార్యక్రమం జరిగింది. ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది శివరాత్రి నాడు ఇలా జరగడం ఎంతో సంతోషకరమని, చిన్నపిల్లల సైతం ఎంతో సంతోషకరంగా రాత్రి అంత జాగారలు చేసారని వార్డు స్థానికుల కొనియాడారు. ఐతి రవి బాబు మాట్లాడుతూ స్వామివారి కరుణాకటాక్షం దక్షిణ నియోజకవర్గ ప్రజలపై, పార్టీ నేతలపై, ముఖ్యంగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు ఆయురారోగ్యాలు సుఖశాంతులు కలగాలని కోరుకున్నారు. ఏడాదికి ఒకసారి వచ్చే ఈ మహాశివరాత్రి రోజున శివయ్యను మనస్ఫూర్తిగా ఆరాధించి ఉపవాసాలు దీక్షలతో రాత్రులు జాగారం చేసి నదులు లేదా సముద్రంలో స్నానమాచరించడం హిందూ సాంప్రదాయమని అన్నారు. ఈ సందర్భంగా దక్షిణ నియోజకవర్గ ప్రజలకు, శ్రేయోభిలాషులకు, కూటమి పార్టీ ముఖ్య నేతలకు కార్యకర్తలకు అందరికీ శివరాత్రి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వార్డులో ఉన్న ఆడపడుచులతోపాటు వార్డులో ఉన్న నాయకులు తదితరులు పాల్గొన్నారు.