విశాఖలో నిరుపేద మృతులకు అంతిమయాత్ర సేవకుడిగా ఉపకార్ ఛారిటబుల్ ట్రస్ట్ చైర్మన్, ప్రముఖ సంఘసేవకులు, డా.కంచర్ల అచ్యుతారవు నిలుస్తున్నారని ట్రస్టు ప్రతినిధి నాగు అన్నారు. ఆరిలోవ నెహ్రూనగర్ కి చెందిన నిరుపేద కంటిపూడి సత్యవతి క్యాన్సర్ తో మృతిచెందారు. దీనితో విషయం తెలుసుకున్న కంచర్ల ఉపకార్ ఛారిటబుల్ ట్రస్టు ద్వారా మట్టికర్చులకి, అంతియమాత్రకు సహకారం అందించారు. ఆది నుంచి విశాఖలోని తూర్పు నియోజకవర్గంలో ఏ పేద కుటుంబానికి కష్టమన్నా నేనున్నాంటూ అండగా నిలుస్తున్న కంచర్ల ఎవరైనా కాలం చేసినా ఇంటికి పెద్దదిక్కుగా తొలిగా స్పందించి మట్టిఖర్చులకు సహాయ సహకారాలు అందిస్తున్నారు. ఈ సందర్భంగా ట్రస్టుప్రతినిధి నాగు మాట్లాడుతూ, శుభకార్యాల్లోనే కాకుండా, కష్ట కాలాల్లోనూ తమ అధినేత డా. కంచర్ల తనవంతుగా సహాయ సహకారాలు అందిస్తున్నారని. ఇలాంటి పుణ్యకార్యాల్లో ట్రస్టు సభ్యులుగా పాల్గొని తమ అధినేత సేవకులిగా పనిచేయడం ఆనందంగా ఉందన్నారు. ఆరిలోవ ప్రాంత వాసులకు డా.కంచర్ల పెద్దదిక్కుగా అయ్యారని అన్నారు. అంతిమయాత్రసేవ అంటే దేవుని సేవగానే భావిస్తున్నట్టు చెప్పారు. కుటుంబ సభ్యులు మాట్లాడుతూ, తమ కుటుంబం పరిస్థితిని తెలుసుకొని పెద్ద మనసుతో ఆర్ధిక సహాయం అందించిన డా.కంచర్లకు ధన్యవాదములు తెలియజేశారు.
