-కంచర్ల వర్కింగ్ జర్నలిస్ట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ లోగో ఆవిష్కరణలో సిపి శంఖబ్రతబాగ్జీ
వర్కింగ్ జర్నలిస్టులకు సంక్షేమ వెన్నుముఖగా కంచర్ల వర్కింగ్ జర్నలిస్ట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ (కెబ్ల్యూజెడబ్ల్యూఏ) దేశంలోనే గుర్తింపు పొందాలని విశాఖ సిటీ పోలీస్ కమిషనర్ డా.శంఖబ్రత బాగ్జీ ఆకాంక్షించారు. ఈ మేరకు మంగళవారం జాతీయ అధ్యక్షులు డా. కంచర్ల అచ్యుతరావుతో కలిసి ఆయన కంచర్ల వర్కింగ్ జర్నలిస్ట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ లోగోను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సిపీ మాట్లాడుతూ, ఆర్ధిక రాజధాని విశాఖ లో మంచి లక్ష్యంతో జర్నలిస్టుల అత్యంత విలువైన సంక్షేమం చేయడానికి డా.కంచర్ల అచ్యుతరావులాంటి వ్యక్తి ఆధ్వర్యంలో ఒక జర్నలిస్ట్ అసోసియేషన్ ప్రారంభం కావడం శుభపరిణామం అన్నారు. సమాజంలో అందరివాడిగా గుర్తింపు ఉన్న వ్యక్తి ఆధ్వర్యంలోనే ఏకంగా జర్నలిస్టులకోసం ఒక అసోసియేషన్ ఏర్పాటు కావడం అంటే జర్నలిస్టులకు మంచిరోజులు వచ్చినట్టేనన్నారు. విశాఖలో ప్రారంభమైన అసోసియేషన్ జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకోవాలని ఆకాంక్షించారు. అనంతరం కంచర్ల వర్కింగ్ జర్నలిస్ట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ జాతీయ అధ్యక్షులు డా. కంచర్ల అచ్యుతరావు మాట్లాడుతూ, జర్నలిస్టులు, మీడియా అంటే తనకు ఆది నుంచి ఎంతో అభిమానమని తన జీవితంలో అగ్రభాగం జర్నలిస్టుల సంక్షేమం చేయడమే ప్రధాన లక్ష్యంగా మారిపోయిందన్నారు. దేశంలోనే ఇప్పటి వరకూ ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా అసోసియేష్ బైలా నేరుగా అందరికీ తెలిసేలా సీపీ శంఖబ్రత బాగ్జీ ప్రారంభించడం ఆనందంగా ఉందన్నారు. ప్రతీ జర్నలిస్టు ఆర్ధికంగా అభివృద్ధి చెందాలనే లక్ష్యంతో మీడియాలో పనిచేసేవారందరిక సంక్షేమం కోసం ప్రత్యేకంగా కార్యక్రమాలు రూపొందించినట్టు చెప్పారు. సమాజంలో నాల్గవ మూల స్థంబంగా ఉన్న మీడియాకి మంచిరోజులు రావాలంటే అన్ని వర్గాలు మీడియాను, జర్నలిస్టులను గుర్తించాల్సి అవసరం ఉందన్నారు. అంతేకాకుండా ప్రత్యేకంగా జర్నలిస్టులకూ ప్రభుత్వం సంక్షేమ పథకాలు అమలు చేయాలన్నారు. దానికోసం కంచర్ల వర్కింగ్ జర్నలిస్ట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ (కెబ్ల్యూజెడబ్ల్యూఏ) ఆధ్వర్యంలో రూపొందించిన ప్రత్యేక ముసాయిదాను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లి దానిని అమలు చేసే విధంగా కృషి చేస్తామన్నారు. వర్కింగ్ జర్నలిస్టుల సొంతింటి కలను (కెబ్ల్యూజెడబ్ల్యూఏ) ద్వారా నిజం చేసి చూపించడానికి ప్రత్యేక ప్రణాళిక కూడా సిద్దం చేశామన్నారు. ఈ సందర్భంగా నగరంలో తిరిగే నకిలీ జర్నలిస్టులను, అనధికార ప్రెస్ వాహనాలను నియంత్రించాలని సిపికి వినతి పత్రం అందజేశారు. అసోసియేషన్ జాతీయ అధ్యక్షులు జర్నలిస్టులకు తమ అసోసియేషన్ ద్వారా ఏ తరహా సంక్షేమం చేయబోతున్నామో తెలిపే ప్రధాన హామీలతో కూడిన బ్రోచర్ ను కూడా అందించారు. అనంతరం అసోసియేషన్ జాతీయ అధ్యక్షులు డా.కంచర్ల అచ్యుతరావు సిపిని ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ , కార్యదర్శి సిహెచ్ దుర్గా ప్రసాద్(విక్టరీ మీడియా టివి), ఉపాధ్యక్షులు పి.బాలభాను(ఈరోజు బాలు) జాయింట్ సెక్రటరీ మానాపురం సురేష్ కుమార్ (యువ) ట్రజరర్ సుధీర్ కుమార్, మెయిన్ కోర్ కమిటీ సభ్యలు కాళ్ల అప్పారావు, సుంకర రాజా, ఇ.గణేష్, వి. అర్జున్ కుమార్, శేఖరమంత్రి జగదీష్ కుమార్, సీనియర్ జర్నలిస్టులు ఇతర కార్యవర్గ సభ్యులు ఉపకార్ ఛారిటబుల్ ట్రస్టు ప్రతినిధులు నాగు, అరుణ తదితరులు పాల్గొన్నారు.