గత వైసిపి ప్రభుత్వం మద్యం పాలసీపై పూర్తిస్థాయి విచారణ జరిపించాలి దోషులను శిక్షించాలని అసెంబ్లీలో తన వాని వినిపించిన దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్
గత ప్రభుత్వం రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేసింది
ఎక్సైజ్ శాఖను పూర్తిగా అవినీతి మయం చేసింది. జే బ్రాండ్స్ ద్వారా ప్రజల ఆరోగ్యంతో ఆడుకుంది
గత వైసిపి ప్రభుత్వం హయంలో మద్యం పాలసీ లో జరిగిన అవినీతి అక్రమాలను దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ అసెంబ్లీలో వివారిస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకుని వెళ్లారు. వైసీపీ ప్రభుత్వం అరాచకంగా చేసిన విధ్వంసకర పాలనలో రాష్ట్రంలోని వ్యవస్థలన్నీ చిన్న భిన్నమయ్యాయి అని చెప్పారు. ముఖ్యంగా ఎక్సైజ్ శాఖను తమ ఆర్థిక దోపిడీకి బ్రష్టు పట్టించారని తెలిపారు. మద్యం షాపుల్లో జే బ్రాండ్లు తప్ప వేరే మద్యం అమ్మకాలకు పెట్టలేదు. ప్రజలు వేరే బ్రాండెడ్ కావాలన్నా బలవంతంగా జే బ్రాండ్లు ఇచ్చారు తప్ప మంచి పద్యాన్ని విక్రయించలేదు. అలాంటి శాఖను కాపాడ్డానికి ముఖ్యమంత్రి చంద్రబాబు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నారా లోకేష్ మద్యంపై కొత్త పాలసీ అమలు చేసినందుకు ధన్యవాదాలు తెలిపారు. అలాగే గత ముఖ్యమంత్రి ఆర్థిక దోపిడీ కోసం ఎక్సైజ్ శాఖను తమకు అనుకూలంగా మార్చుకొని ఎంత ఇబ్బంది పెట్టారో అనే కొన్ని విషయాల్ని ప్రస్తుత ఎక్సైజ్ శాఖ మంత్రి దృష్టికి తీసుకొని వెళ్లారు. మద్యం తయారు చేసే కంపెనీల దగ్గర నుంచి బిల్లులు లేకుండా కొన్ని వందల లారీలు మద్యం దుకాణాలకి వచ్చింది వాస్తవమా కాదా తేల్చాలన్నారు. మద్యం రవాణా చేసే కంపెనీలు ట్రాన్స్పోర్ట్ రూ.18 ఉంటే ఒకేసారి రు.36 పెంచారని వివరించారు. ఈ రవాణా నిర్వాహకుల నుంచి నెలసరి మామూలు తీసుకున్నారనీ దీనిపై విచారణ చేయాలని కోరారు. ఉదయం 9 నుంచి రాత్రి 9 వరకు జరిగిన మద్యం విక్రయాల కలెక్షన్ బ్యాంకు వారు తీసుకుని వెళ్లేవారు, 9 తర్వాత 11:30 గంటల వరకు జరిగే మద్యం అమ్మకాల నగదును కొంతమంది కలెక్షన్స్ బాయ్స్ వచ్చి తీసుకుని వెళ్లేవారు, ఈ అమౌంట్ ప్రభుత్వానికి వెళ్లిందా వారి సొంత జోబుల్లోకి వెళ్లిందా అనే విషయంపై విచారణ చేయాల్సి ఉందని కోరారు. లిక్కర్ షాపులకు మ్యాన్ పవర్ సప్లై ఒకరికి ఇవ్వకుండా రెండు మూడు విభాగాలుగా విభజించి ఏర్పాటు చేశారు. ఈ మాన్ పవర్ సప్లయర్స్ దగ్గర నుంచి కూడా నెలసరి మామూలు తీసుకున్నారు అనే వివరాలు వారి దగ్గర స్పష్టంగా ఉన్న వారిని పిలిచి విచారణ చేస్తే నిజ నిజాలు బయటకు వస్తాయని వివరించారు. మద్యం తీసుకొచ్చే అట్టపెట్టెలు కూడా వదలకుండా దోచుకున్నారని అసెంబ్లీలో తెలిపారు. వీటన్నిటి పైన క్షుణ్ణంగా విచారణ జరిపి మూల కారకులైన వారందరపై చర్యలు తీసుకోవాలని కోరారు. గత వైసిపి ప్రభుత్వం మద్యం పాలసీలో పనిచేసిన ట్రాన్స్పోర్ట్ గాని పిలిపించి విచారిస్తే ఈ శాఖలో ఎంత అవినీతి అక్రమాలు జరిగాయో బయటకు వస్తాయన్నారు. వైసిపి మద్యం పాలసీ పై ప్రజల్లో చాలా అనుమానాలు ఉన్నాయి ఓటమి ప్రభుత్వం అది తేల్చాల్సిన అవసరం ఉంది కాబట్టి గత ప్రభుత్వ మద్యం పాలసీ పై పూర్తి విచారణ జరిపించాలని వంశీకృష్ణ శ్రీనివాస్ కోరారు.