ఉపాధి హామీలో 50 సంవత్సరాలు నిండిన మేటులను తొలగించాలని ప్రభుత్వం తీసుకున్న అనాలోచిత నిర్ణయాన్ని తక్షణం వెనక్కి తీసుకోవాలని. ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మికసంఘం జిల్లా సహాయ కార్యదర్శి బళ్ళ చిన వీరభద్రరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వ్యవసాయ కార్మిక సంఘం సభ్యత్వ నమోదు కార్యక్రమంలో భాగంగా దువ్వ గ్రామములో మూడవ రోజు కొనసాగింది. ఈ సందర్భంగా వీరభద్రరావు మాట్లాడుతూ ఉపాధి హామీ చట్టం ప్రారంభం నాటి నుండి ప్రభుత్వానికి కూలీలకు మధ్య వారధిగా ఉంటూ ఉపాధిహామీలో కీలకపాత్ర పోషిస్తున్న మెట్లుకు వయసు నిబంధన పెట్టడం సరికాదని వీరభద్ర రావు విమర్శించినారు. ఉపాధి హామీలో రెండు కిలోమీటర్లు పరిధిలో మొదటి ఫోటో అయ్యేలా చూడాలని, రెండవ ఫోటో తీయాలనే నిబంధన రద్దు చేయాలన్నారు. ఉపాధి హామీ చట్టాన్ని మరింత పగడబందీగా అమలు చేసి కూలీలకు ఎక్కువ పని కల్పించేందుకు రాష్ట్రంలో కూటమిప్రభుత్వం కేంద్రం నుంచి పెద్దఎత్తున నిధులు తీసుకువచ్చి అడిగిన ప్రతి కుటుంబానికి రెండువందల రోజులు పనికల్పించి, పెరిగిన ధరలకు అనుగుణంగా రోజువారీ కూలీ రూ.600కు పెంచాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో దొంగల నాగేశ్వరరావు, బండారు వెంకటేశ్వరరావు, వంక దుర్గ, ఇళ్ల వరలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
