తణుకు భాష్యం స్కూల్ ఫేర్వెల్ వేడుకలు శనివారం స్కూల్ ఆవరణలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా తణుకు పట్టణ టిడిపి అధ్యక్షులు కలగర వెంకటకృష్ణ సూర్య తేజ ఆర్థోపెడిక్ హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ మద్దుకూరి వీర వెంకట ప్రకాష్ (ఎం ఎస్ ఆర్దో) విచ్చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మంచి ప్రవర్తన కలిగి ఏకాగ్రతతో కష్టపడి చదివితే రాబోవు పబ్లిక్ పరీక్షలలో విద్యార్థులు మంచి మార్కులు సాధించవచ్చునని అదేవిధంగా భవిష్యత్తు కొరకు ఇప్పటినుండే మంచి ప్రణాళికలు ఏర్పాటు చేసుకుని తథనుగుణంగా కృషిచేసి ఉన్నత స్థాయి సాధించాలని విద్యార్థులకు సూచించారు. అనంతరం భాష్యం స్కూల్ ప్రిన్సిపాల్ ఏ శ్రీమన్నారాయణ రెడ్డి మాట్లాడుతూ తల్లిదండ్రులను ఉపాధ్యాయులను గౌరవించాలని కష్టముతో కాకుండా ఇష్టంగా చదువుకుని రాబోవు పబ్లిక్ పరీక్షలలో అత్యుత్తమ మార్కులు సాధించి ఉన్నతంగా ఎదిగి తల్లిదండ్రులకు ఉపాధ్యాయులకు విద్యను అభ్యసించిన పాఠశాలకు మంచి పేరును తీసుకురావాలని అన్నారు. ఈ సందర్భంగా తొమ్మిదవ తరగతి పదవ తరగతి ఉత్తమ ప్రతిభను కనబరిచిన విద్యార్థులకు బహుమతులను ముఖ్య అతిథులు చేతుల మీదుగా అందజేశారు, కార్యక్రమంలో భాగంగా చిన్నారులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను అలరించాయి.
