యానాం నుంచి కంతేరుకు తరలిస్తుండగా పట్టివేత
రూ. 11 లక్షల విలువైన సొత్తు స్వాధీనం
నిందితులలో ఒకరు అరెస్టు… పరారీలో మరో ఇద్దరు
జిల్లా ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్ అధికారి ఎక్సైజ్ కుమరేస్వరన్ వెల్లడి
యానాం నుంచి అక్రమంగా జిల్లాకు తరలిస్తున్న మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్న తణుకు ఎక్సైజ్ అధికారులు. యానాం నుంచి ఇరగవరం మండలం కంతేరు గ్రామానికి తరలిస్తుండగా దాడి చేసి నిందితుడిని పట్టుకున్నారు. ఈ సందర్భంగా కంతేరు గ్రామానికి చెందిన కొవ్వూరు వెంకట శ్రీనివాసరెడ్డి అరెస్టు. అతని వద్ద నుండి రూ. 3 లక్షల విలువైన మద్యం బాటిళ్లతోపాటు కారును స్వాధీనం చేసుకున్నారు.
ఈ సందర్భంగా తణుకులో ఏర్పాటుచేసిన ప్రెస్ మీట్లో వివరాలు వెల్లడించిన జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ అధికారి డాక్టర్ ఆర్ఎస్ కుమరేశ్వరన్.
యానాం నుంచి ఇరగవరం మండలం కంతేరు గ్రామానికి ఏపీ 37సీఎల్ 7899 నెంబరు కలిగిన కారులో అక్రమంగా మద్యం తరలిస్తున్నట్లు వచ్చిన సమాచారంతో తణుకు ఎక్సైజ్ సీఐ సత్తి మణికంఠరెడ్డి ఆధ్వర్యంలో సిబ్బంది దాడి. 43 లీటర్లు పరిమాణం కలిగిన 219 మద్యం బాటిళ్లను స్వాధీనం. గతంలోనూ ఇదే తరహాలో యానాం నుంచి మద్యం తీసుకువచ్చి డోర్ డెలివరీ చేసే శ్రీనివాసరెడ్డి. స్వాధీనం చేసుకున్న మద్యం విలువ రూ. 3 లక్షలు కాగా కారుతో కలిపి మొత్తం సొత్తు విలువ రూ. 11 లక్షలు కాగా మరో ఇద్దరునిందితులైన ఈ కేసులో వెంకటసత్యనారాయణరెడ్డి అలియాస్ భరత్రెడ్డి, ప్రేమ్కుమార్లను పరారీ లో ఉన్నారని తెలిపారు. నిందితుడు శ్రీనివాసరెడ్డికి రిమాండ్. త్వరలోనే విరిని అరెస్టు చేస్తామని వెల్లడించిన కుమరేశ్వరన్.