ఇంటి నిర్మాణ పనులను పూర్తి చేసేలా స్థైర్యం వొచ్చింది – కే.. నాగదుర్గ
ఆర్ధిక ఇబ్బందుల వల్ల నిలిచి పోయిన ఇంటి నిర్మాణ పనులకు అందించిన రూ.50 వేలు ఆర్ధిక సహాయం వల్ల మా స్వంత ఇంటి కల సాకారం కాబోతుండడం ఎంతో ఆనందాన్ని ఇస్తోందని బిసి కులానికి చెందిన కే.నాగదుర్గ తెలియచేశారు.
బుధవారం పెరవలి మండలం కానూరు గ్రామానికీ చెందిన లబ్దిదారుల కలిసి వారికి ప్రభుత్వం ప్రకటించిన ఆర్ధిక సహాయం వివరాలు అధికారులు తెలియ చేయడం జరిగింది. ఈ సందర్భంగా కానూరు కి చెందిన కే . నాగదుర్గా మాట్లాడుతూ, ఆర్ధిక ఇబ్బందుల్లో ఇంటి నిర్మాణ పనులను పూర్తి చే యడం సాధ్యం కాలేదని తెలిపారు. ఇప్పుడు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అందించిన 50 వేల రూపాయలతో ఇంటి నిర్మాణ పనులను పూర్తి చెయ్యగలం అనే నమ్మకం పెరిగిందన్నారు. బీసీ లకి రూ.50 వేలు ఆర్ధిక సహాయం వల్ల ఇంటి నిర్మాణ పనుల కొరకు ముందుకి రావటం జరిగిందన్నారు . రాష్ట్ర ప్రభుత్వం కి, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కి కృతజ్ఞతలు తెలియ చేస్తున్నట్లు తెలిపారు.
మండల పరిధిలో ఇంకా ఇంటి నిర్మాణ పనులను పూర్తి చెయ్యవలసిన మొత్తం 266 లబ్ధిదారుల్లో ఎస్సీలు 119 ఎస్టీలు ఎనిమిది మంది , బీసీలు 139 మంది ఉన్నారన్నారు.. క్షేత్ర స్థాయిలో పర్యటించి ప్రభుత్వం ప్రకటించిన ఆర్ధిక సహాయం వివరాలు తెలియ చేస్తూన్నట్లు అధికారులు తెలిపారు. గృహ లబ్దిదారులు ఈ అవకాశాన్ని తక్షణం సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఇంటి నిర్మాణ పనులను 2025 మే నెలాఖరు నాటికి పూర్తి చేసుకోవాలని కోరారు.
ఈ కార్యక్రమంలో హౌసింగ్ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఎమ్. విక్టర్ బాబు , సచివాలయం సిబ్బంది పాల్గొన్నారు.