మార్చి నెల స్వచ్ఛ ఆంధ్ర – స్వచ్ఛ దివస్ లో భాగంగా మార్చి నెలలో ప్రభుత్వం నిర్దేశించిన మూడు అంశాలు
- వ్యక్తిగత పరిశుభ్రత , ఆరోగ్యం పై అవగాహన కల్పించడం
- మురుగు కాలువలు నీటి వనరుల పరిశుభ్రతపై ఏక దృష్టి పెట్టడం
- ప్లాస్టిక్ రహిత ప్రదేశాల ప్రచారం, ప్లాస్టిక్ నిర్మూలన గూర్చి ప్రచారం చేయడం. పరిశుభ్రమైన ఆంధ్రప్రదేశ్ = ఆరోగ్య ఆంధ్ర + అభివృద్ధి ఆంధ్ర. పాఠశాలల నుంచి ఈ అవగాహనను పెంపొందించాలి. “స్వచ్ఛ విద్యాలయ – ఆరోగ్య భవిష్యత్తు” పేరుతో విద్యార్థులకు ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి. పరిశుభ్రత ప్రభుత్వ సొంత కార్యక్రమం కాదు , ఇందులో ప్రజల సహకారం తప్పనిసరి.
పరిశుభ్రత వ్యక్తిగత శ్రేయస్సు మాత్రమే కాదు సమాజ శ్రేయస్సుకు మూలాధారం స్వచ్ఛతతో ఆరోగ్యాన్ని , అభివృద్ధిని సంకల్పిద్దాం.