ఆదివారం పెరవలి మండల పరిషత్ సర్వసభ్య సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న మంత్రి కందుల దుర్గేష్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండల ప్రజా ప్రతినిధులు ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు, పట్ల ప్రజలలో అవగాహన కల్పించాలని వాటిని సద్వినియోగం చేసుకోవడం ద్వారా పేదలు మరింత అభివృద్ధి చెందాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ప్రపంచ క్షయ వ్యాధి దినోత్సవం సందర్భంగా మాట్లాడుతూ క్షయ వ్యాధి నివారణ కొరకు ప్రభుత్వం అందిస్తున్న మందులను వాడుతూ పౌష్టికాహారం క్రమం తప్పకుండా తీసుకొని ఎడల నివారించవచ్చని, క్షయ వ్యాధి వ్యాప్తి చెందకుండా ముందు జాగ్రత్తలు పాటిస్తూ ఉండాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల పరిషత్ అధ్యక్షులు కార్చెర్ల సీతారామ ప్రసాద్, ఎమ్మెల్సీ వంక రవీంద్రనాథ్, మండల తహసిల్దార్, ఎంపీడీవో, ఇతర శాఖల అధికారులు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
