ఆదివారం ఉండ్రాజవరం మండల పరిషత్ సర్వసభ్య సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న మంత్రి కందుల దుర్గేష్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండల ప్రజా ప్రతినిధులు ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు, పట్ల ప్రజలలో అవగాహన కల్పించాలని వాటిని సద్వినియోగం చేసుకోవడం ద్వారా పేదలు మరింత అభివృద్ధి చెందాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ప్రపంచ క్షయ వ్యాధి దినోత్సవం సందర్భంగా మాట్లాడుతూ క్షయ వ్యాధి నివారణ కొరకు ప్రభుత్వం అందిస్తున్న మందులను వాడుతూ పౌష్టికాహారం క్రమం తప్పకుండా తీసుకొని ఎడల నివారించవచ్చని, క్షయ వ్యాధి వ్యాప్తి చెందకుండా ముందు జాగ్రత్తలు పాటిస్తూ ఉండాలన్నారు. మంచి పౌష్టికాహారం తోటి ఆరోగ్యాన్ని నిలబెట్టుకోగలిగితే తొందరలోనే నయం అవుతుంది మళ్లీ మామూలుగా అందరూ ఆరోగ్యవంతమైన జీవించే అవకాశం కూడా ఉంటుంది దానికి ప్రధానంగా కావాల్సింది మంచి ఆరోగ్యకర వాతావరణంలో ఉండటం ఆహారపు అలవాట్లు మంచిగా చూసుకోవడం దాంతో పాటు ఇచ్చినటువంటి మందులను సక్రమంగా వాడతాం. ఈ మూడు చేయగలిగితే వచ్చినటువంటి టీవీని మనం దానికి సంబంధించి కూడా ముందు నుంచి పౌష్టికాహారాలు తీసుకోవడం ద్వారా అన్ని గ్రామాలు కూడా టీ.బి. రహిత గ్రామాలుగా మనం తయారు చేసుకోవడానికి పూర్తి స్థాయిలో కృషి చేయాల్సిందిగా మిమ్మల్ని అందరిని కోరుతున్నాను. జాతీయ క్షయ వ్యాధి నివారణ దినోత్సవవం ను పురస్కరించుకుని, మండలంలో టిబి రహిత గ్రామాలుగా తీర్చిదిద్దేందుకు సహకరించిన సర్పంచ్ లను మంత్రి శాలువా కప్పి సన్మానించారు. మరిన్ని గ్రామాలు టీబి రహిత గ్రామాలుగా ఏర్పడాలని సూచించారు. ఉండ్రాజవరం పిహెచ్సి వైద్యాధికారి డాక్టర్ ఆర్ఎస్ఎస్ ప్రసాద్ రావు, టిబి సీనియర్ ట్రీట్మెంట్ సూపర్వైజర్ వి.వి. ఆశాజ్యోతి ల సమక్షంలో మంత్రి దుర్గేష్ చేతుల మీదుగా టీబీ వ్యాధిగ్రస్తులకు పౌష్టిక ఆహారం కిట్స్ అందజేశారు. ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, ఎంపీడీవో, తహసిల్దార్, వివిధ ప్రభుత్వ శాఖల మండల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
క్షేత్ర స్థాయిలో “జనవాణి” కార్యక్రమం ద్వారా ప్రతి ఒక్కరితో మాట్లాడి గ్రామ, మండల స్థాయి మరియు పేద, బడుగు, బలహీన వర్గాల సమస్యలు అన్నీ తెలుసుకుని ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా వాటిని పరిష్కరించి తదుపరి నెలలో జరిగే మండల సర్వసభ్య సమావేశాలలో ఎంతవరకూ మునుపటి సమస్యల్ని తీర్చగలిగాను, అలాగే మిగిలిన సమస్యల్ని ఎప్పటికీ పరిష్కరిస్తాను అనే పూర్తి వివరాలు అందరికీ తెలియజేస్తాను.