నరసరావుపేట పట్టణంలో 25వ వార్డు NGO కాలనీలో గల కోడెల పార్క్ నందు స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమములో భాగంగా స్పెషల్ శానిటైజేషన్ డ్రైవ్ నిర్వహించారు ఈ కార్యక్రమానికి నరసరావుపేట శాసనసభ్యులు డా.చదలవాడ అరవిందబాబు పాల్గొని పార్క్ లోని చెత్తను ఊడ్చారు. అనంతరం విద్యార్థులతో కలిసి ముచ్చటిస్తూ చదువుతోపాటు ఆటలు కూడా ఆడాలని చిన్నారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ జనసేన బీజేపీ కూటమి నేతలు పాల్గొన్నారు.
