- భీమవరంలో మినిస్టర్ వైట్ షోరూంను ప్రారంభించిన ఎమ్మెల్యే అంజిబాబు
వినూత్న శైలిలో సాంప్రదాయక వస్ట్రాలు, నాణ్యమైన స్వదేశీ వస్త్రాలకు కేరాఫ్ మినిస్టర్ వైట్ అని రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు (అంజిబాబు) అన్నారు. ఈ సందర్భంగా గురువారం భీమవరం పిపి రోడ్ లో మినిస్టర్ వైట్ షోరూంను ఎమ్మెల్యే అంజిబాబు ప్రారంభించి మాట్లాడారు. సరసమైన ధరల్లో నాణ్యమైన ధోతీలు, షర్టులు ఒకేచోట లభించడం సంతోషదాయక మన్నారు. మినిస్టర్ వైట్ కంపెనీ సిబిఓ సురేష్ రామ సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ భారతదేశం వ్యాప్తంగా 40 షోరూం లున్నాయి, ఆంధ్రప్రదేశ్ లో తిరుపతి, తణుకు, కాకినాడ, విజయనగరం, పలాస లతోపాటు భీమవరంలో 6వ షోరూమ్ ప్రారంభించామని, త్వరలో తెలంగాణలో రెండు షోరూంలను ప్రారంభిస్తామన్నారు. తెల్ల షర్టులు, కలర్ షర్టులు సిల్క్, లినెన్ షర్టులు మా ప్రత్యేకత అని, ఒకటో సంవత్సరం పిల్లల దగ్గర నుంచి 16వ సంవత్సరం పిల్లల వరకు అన్ని రకాల ఉత్పత్తులు లభిస్తాయని తెలిపారు. కార్యక్రమంలో ఆశిష్, కిషోర్, ఆంధ్ర ఏరియా సేల్స్ మేనేజర్ జహిరుద్దీన్, బండి రమేష్ కుమార్, వబిలిశెట్టి రామకృష్ణ, కిరణ్, లంకి చిన్ని తదితరులు, భారీగా వస్ట్రాభిమానులు పాల్గొన్నారు.