కిస్నా డైమండ్ అండ్ గోల్డ్ జ్యువెలరీ మే 3, 4 తేదీలలో గాజువాక హోటల్ బెస్ట్ వెస్ట్రన్ రామచంద్రాలో రేర్ సాలిటైర్ వజ్రాల రెండు రోజుల గ్రాండ్ ఎగ్జిబిషన్ నిర్వహించింది. విశాఖపట్నం ప్రాంతంలోని గాజువాకలో నిర్వహించిన మొట్టమొదటి సాలిటైర్ వజ్రాల ప్రదర్శన వజ్రాల ప్రేమికుల మనస్సు దోచుకుంది.హరి కృష్ణ గ్రూప్ వ్యవస్థాపకుడు మరియు మేనేజింగ్ డైరెక్టర్ ఘనశ్యామ్ ధోలాకియా గౌరవ అతిధిగా హాజరై వజ్రాల ఎగ్జిబిషన్ ప్రారంభించిన అనంతరం ఆయన మీడియా తో మాట్లాడుతూ కిస్నా బ్రాండ్ దృష్టి ప్రతి భారతీయుడికి వజ్రాలను అందుబాటులో ఉంచడమన్నారు. గాజువాక వంటి అభివృద్ధి చెందుతున్న నగరాల్లో ఇలాంటి ప్రదర్శనలతో, వినియోగదారులకు పారదర్శకంగా మరియు సరసమైన ధరలకు ఉత్తమ నాణ్యత గల వజ్రాలను అందించడమే తమ లక్ష్యమని తెలిపారు.గాజువాక పరిసర ప్రాంతాల ప్రజల నుండి వచ్చిన అధిక స్పందన తమకు ఎంతో సంతోషం కలిగించిందన్నారు.కిస్నా గాజువాక ఫ్రాంచైజ్ భాగస్వాములు రాంబాబు కొత్తపల్లి, లక్మణరావు, భీమారావు, దామోదరరావు లు వినియోగదారులకు స్వాగతం చెబుతూ గాజువాకలో వజ్ర ప్రియుల కోసం మొదటిసారిగా అద్భుతమైన ఈవెంట్ నిర్వహించడం చాలా ఆనందంగా ఉందన్నారు. వినియోగదారులు 0.30 సెంట్ల నుండి 5 క్యారెట్ల వరకు సాలిటైర్ వజ్రాలను కొనుగోలు చేయవచ్చునన్నారు. కేవలం ₹32,000 రూపాయల నుండి తమ వద్ద అపురూప వజ్రాలు లభిస్తాయన్నారు.ఈ ప్రదర్శనలో మహిళా వినియోగదారులకు మెహందీ కార్యక్రమం, ప్రతి వినియోగదారునికి బహుమతులు అందచేశారు. పెద్ద సంఖ్యలో గాజువాక పరిసర ప్రాంత వజ్రాలు,నగల ప్రేమికులు,స్థానిక ప్రముఖులు కుటుంబ సమేతంగా రేర్ సాలిటైర్ వజ్రాల ప్రదర్శనకు హాజరై కొనుగోళ్లు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు.
