భారత రాజ్యాంగనిర్మాత, భారతరత్న డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ 134 జయంతిని పురస్కరించుకుని ఏప్రిల్ 13 నుండి 25 వరకు భారతీయ జనతాపార్టీ రెండు తెలుగు రాష్ట్రాలలో వివిధ కార్యక్రమాలు నిర్వహించనుంది. ఈ సందర్భంగా శనివారం ఆంధ్రప్రదేశ్ బిజెపి అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధరేశ్వరి అధ్యక్షతన విజయవాడలో జరిగిన సమావేశానికి ముఖ్య అతిథిగా బిజెపి జాతీయ ఉపాధ్యక్షురాలు, మహబూబ్ నగర్ ఎం.పి. డి.కే. అరుణ, బిజెపి జాతీయ కార్యవర్గ సభ్యులు, ఎం.ఎల్.సి. సోము వీర్రాజు పాల్గొన్నారు. ఈ సమావేశంలో నవభారత నిర్మాత, బహుముఖ ప్రజ్ణాశాలి అయిన అంబేద్కర్ స్పూర్తితో చేపట్టవలసిన కార్యక్రమాలపై చర్చ చేపట్టి, పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర బిజేపి నాయకురాలు, తణుకు మాజీ మున్సిపల్ చైర్మన్ ముళ్ళపూడి రేణుక, రాష్ట్రంలోని అన్ని జిల్లాలనుంచి నాయకులు, కార్యర్తలు హాజరైనారు.
