మున్సిపల్ చైర్మన్ పై వీగిన అవిశ్వాస తీర్మానం.. నెగ్గిన జనసేన
నిడదవోలులో చక్రం తిప్పిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక మరియు సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ ,జీరో స్థాయి నుండి పీఠం అధిష్టించే స్థాయికి చేరడంలో కందుల దుర్గేష్ చొరవ
జనసేన పంచన 13 మంది వైసీపీ కౌన్సిలర్లు,టీడీపీ,ఎక్స్ అఫీషియోతో కలిపి 15కు చేరిన జనసేన బలం..
రాజకీయ చతురత ప్రదర్శించిన మంత్రి కందుల దుర్గేష్. జనసేనాని పవన్ కళ్యాణ్ విధానాలు,మంత్రి దుర్గేష్ కలుపుగోలుతనం,కూటమి ప్రభుత్వ అభివృద్ధి నచ్చి జనసేన లో చేరిన పలువురు కౌన్సిలర్లు..
రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక మరియు మరియు సినిమాటోగ్రఫీ మంత్రివర్యులు కందుల దుర్గేష్ రాజకీయ చతురతతో ఎట్టకేలకు నిడదవోలు మునిసిపాలిటీ పీఠం జనసేన కైవసం చేసుకుంది. రాష్ట్రంలో జనసేన పార్టీ ఖాతాలో ఇది తొలి మున్సిపాలిటీగా నిలిచింది. గత కొన్నాళ్లుగా నిడదవోలు మున్సిపల్ ఛైర్మన్ పీఠం విషయంలో రేగిన ఉత్కంఠకు తెరపడింది. జనసేన వ్యూహ, ప్రతివ్యూహాలతో వేసిన అడుగులు విజయం వైపు దారి తీశాయి. దీంతో జనసేన పార్టీ శ్రేణులు, కూటమి శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నాయి.