తణుకు మండల పరిషత్ సాధారణ సమావేశము శుక్రవారం మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు రుద్రా ధనరాజు అధ్యక్షతన మండల కార్యాలయ సమావేశమందిరంలో జరిగింది. సమావేశములో శాఖలవారీగా సంభదితశాఖల అధికారులు మండలంలో ప్రస్తుతం అమలు జరుగుతున్న వివిధ అభివృద్ధి పనులు, సంక్షేమ పదకాలకు సంబందించి వివరించడం జరిగింది. సదరు సమావేశములో సభ్యలు అడిగిన సందేహాలకు నివృతం చేయడం జరిగింది.
సదరు సమావేశమునకు ఎం.ఎల్.సి. వంక రవీంద్ర, జడ్.పి.టి.సి. సభ్యులు శ్రీమతి ముళ్ళపూడి అన్నపూర్ణ దేవి, మండల ఎం.పి.టి.సి. సభ్యులు, తహశిల్దార్ డి.అశోక్ వర్మ, మండల పరిషత్ అభివృద్ధి అధికారి (FAC) ఆముదాలపల్లి శ్రీనివాస్, అడ్మినిస్ట్రేటివ్ అధికారి వి. కృష్ణచంద్రరావు, మండలస్థాయి అధికారులు, మండలం నందలి అందరు పంచాయతీ కార్యదర్శులు, మండలం ప్రజాపరిషత్ సిబ్బంది హాజరు అయ్యారు.
