డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు రాజీనామా చేయాలని సిపిఎం పార్టీ మండల కన్వీనర్ కామన మునిస్వామి డిమాండ్ చేశారు. శుక్రవారం నాడు సిపిఎం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీనివాసరావును అవమానకరంగా మాట్లాడిన డిప్యూటీ స్పీకర్ కనుమూరి రఘురామకృష్ణరాజుకు వ్యతిరేకంగా ఇరగవరంలో సిపిఎం పార్టీ కార్యకర్తలు శుక్రవారం నాడు నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా కామన మునిస్వామి మాట్లాడుతూ ప్రజల సమస్యలపై పోరాడుతున్న ప్రజల పక్షాన పనిచేస్తున్న సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శిని ప్రజా ప్రతినిధి అయిన ఉండి శాసనసభ్యులు కనుమూరి రఘురామకృష్ణంరాజు పరుష పదజాలంతో మాట్లాడడం తగదని మునిస్వామి అన్నారు. ప్రజల పక్షాన పనిచేయవలసిన శాసనసభ్యులు ప్రజలను బాధపెట్టే విధంగా ఉండరాదని తెలిపారు. పాలకోడేరులోని సీతారామరాజు నగరంలో గత 50 సంవత్సరాల నుండి ఇల్లు వేసుకుని నివాసం ఉంటున్న పేదప్రజలు ఇల్లును దౌర్జన్యంగా తొలగించడానికి ఆయన తీవ్రంగా దుయ్యబట్టారు. పేదలకు అండగా నిలబడే సిపిఎం పార్టీ బాధితుల దగ్గరకు పాలకోడేరు గ్రామము వెళ్ళి వారి యొక్క సమస్యలను అడిగి తెలుసుకున్న రాష్ట్ర సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావును అసంధర్భ పదజాలంతో మాట్లాడడం ప్రజాప్రతినిధిగా తగదని అన్నారు. గతంలో నరసాపురం పార్లమెంట్ సభ్యులుగా కనుమూరిరఘు రామకృష్ణంరాజు ఉన్నప్పుడు ప్రజల సమస్యలను గాలికి వదిలేసి ఐదు సంవత్సరాలు ఢిల్లీలో విలాసవంతంగా జీవితం గడిపారని మునిస్వామి అన్నారు. గంటకో పార్టీ గంటకో మాట మాట్లాడే నాయకుడు రఘురామకృష్ణరాజు అన్నారు. బ్యాంకుల నుండి సుమారు 600 కోట్ల రూపాయలు రుణాలు తీసుకుని ఆ రుణాలు తీర్చకుండా బ్యాంకులను మోసం చేశారని ఈయన ప్రజాప్రతినిధిగా పనిచేయడానికి తగడని కామన మునిస్వామి అన్నారు. రాష్ట్రంలో ప్రజలు అనేక కష్టాల్లో ఉన్నారని అటువంటి ప్రజలపై ప్రజాప్రతినిధి ఉండి శాసనసభ్యులు కన్నుమూరి రామకృష్ణంరాజు అధికారులచే ప్రజలపై దాడులు చేయించడం తగదని అన్నారు. సిపిఎం పార్టీ కార్యదర్శిని పై అవమానకరముగా మాట్లాడిన దానికి క్షమాపణ చెప్పాలని మునుస్వామి డిమాండ్ చేశారు. లేనిపక్షంలో సిపిఎం పార్టీ పెద్ద ఎత్తున ఉద్యమాన్ని నిర్వహిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ సభ్యులు జక్కంచెట్టి గంగాధర్ రావు, గుబ్బల ముత్యాలు , పిచ్చేటి సుబ్బారావు, జుత్తిగ రామాంజనేయులు తదితరులు పాల్గొన్నారు.
