ఇందిరా నగర్ -1,ఇందిరా నగర్ -2 లో ఫాగ్గింగ్ పై గంకల ప్రత్యేక డ్రైవ్
ప్రతి రోజు వార్డులో పర్యటన చేస్తూ సమస్యలపై సత్వర పరిష్కారం చూపుతున్న గంకల కవిత అప్పారావు
ప్రజా సమస్యల పరిష్కారమే గుడ్ మార్నింగ్ గంకల
ప్రజా సమస్యల పరిష్కారమే గుడ్ మార్నింగ్ గంకల అని ప్రతి క్షణం ప్రజల కోసమే గుడ్ మార్నింగ్ గంకల కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగిందని 48వ వార్డ్ కార్పొరేటర్, జీవీఎంసీ భారతీయ జనతా పార్టీ ఫ్లోర్ లీడర్ గంకల కవిత అప్పారావు అన్నారు.గత కొద్దీ రోజులుగా పడిన అకాల వర్షాల పట్ల పెరిగిపోతున్న దోమలు,కీటకాలు ప్రబలకుండా 48వ వార్డులో 48వ వార్డు కార్పొరేటర్,జీవీఎంసీ భారతీయ జనతా పార్టీ ఫ్లోర్ లీడర్ గంకల కవిత అప్పారావు శనివారం నాడు ఇందిరా నగర్ -1, ఇందిరా నగర్ -2లో గుడ్ మార్నింగ్ గంకల కార్యక్రమంలో అధిక దోమలు పై వచ్చిన పిర్యాదు మేరకు గంకల కవిత అప్పారావు పారిశుధ్య,మలేరియా డిపార్ట్మెంట్ కార్మికులతో కలిసి పర్యటన చేసి ఫాగ్గింగ్ మెషిన్ సహాయంతో ఫాగ్గింగ్ పనులు చెప్పటారు.ఈ సందర్బంగా గంకల కవిత అప్పారావు మాట్లాడుతూ గత కొద్దీ రోజులుగా పడుతున్న అకాల వర్షాలకు ఎక్కడ పడితే అక్కడ చెత్త కుప్పలు కుప్పలుగా ఉండడంతో పెరిగిపోతు దోమలు, కీటకాలు ప్రబలకుండా చర్యలు చేపట్టాలని గుడ్ మార్నింగ్ గంకల కార్యక్రమంలో అధిక దోమలు పై వచ్చిన పిర్యాదు మేరకు ఇందిరా నగర్ -1ఇందిరా నగర్ -2 ప్రాంతంలో దోమలు, కీటకాలు ప్రబలకుండా ఫాగ్గింగ్ పనులు చేపటడం జరిగిందని,పరిసరాల పరిశుభ్రతతోనే అందరికీ ఆరోగ్యం సమకూర్తుందని తెలిపారు. వార్డు అభివృద్ధిలో ప్రజలు భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. ఎటువంటి ఆరోగ్య సమస్య ఏర్పడిన తక్షణమే ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో టెస్ట్ లు చేసుకోవాలని అన్నారు. వార్డులో ప్రజలకు ఎటువంటి సమస్య ఏర్పడిన గుడ్ మార్నింగ్ గంకల కార్యక్రమం లో ఫిర్యాదు చేయాలని పిలుపునిచ్చారు. పిర్యాదు మేరకు నేరుగా వెళ్లి సమస్య పై సమీక్షా జరిపి సమస్య పరిష్కారం పట్ల వార్డు ప్రజలు హర్షం వ్యక్తం తెలిపారు.ఈ కార్యక్రమంలో గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.