సాహితీ సామ్రాజ్యం ఆధ్వర్యంలో తణుకు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి ప్రాంగణంలో ఆదివారం ప్రపంచ మాతృ దినోత్సవ ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సహితి సామ్రాజ్యం అధ్యక్షులు తాడినాడ భాస్కరరావు మాట్లాడుతూ అమృతానికి అర్పణకు అసలు పేరు అమ్మ అని ఈ లోకమని గుడి చేరగా తొలి వాకిలి అమ్మ అని అన్నారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో జిల్లా వైద్యాధికారిణి డాక్టర్ వెలగల అరుణ మాట్లాడుతూ అమ్మ ప్రేమ అనంతమని, మాట మధురం, కరుణ అపారమని అన్నారు. వైద్య వృత్తిలో నర్సుల సేవలు వెలకట్టలేనివి అని ఎంతో ఓదార్పుతో ప్రేమతో వారు చేసే సేవలు ఆదర్శమని అన్నారు. అదేవిధంగా ఈ కార్యక్రమంలో నర్సింగ్ సూపరింటెండెంట్ డాక్టర్ మానుకొండ కృపావరం మాట్లాడుతూ ఫ్లోరెన్స్ నైటింగేల్ నర్సుల వ్యవస్థకు పూజనీయురాలని ఆమె జన్మదినాన్ని అనగా మే 12వ తేదీ ప్రపంచ నర్సుల దినోత్సవంగా జరుపుకుంటారని అన్నారు. అనంతరం జిల్లా వైద్యాధికారిని డాక్టర్ వెలగల అరుణ, ప్రసూతి వైద్య నిపుణులు డాక్టర్ కింతాడ వెంకట శ్రీలక్ష్మి, నర్సింగ్ సూపరింటెండెంట్ డాక్టర్ మానుకొండ కృపావరం, ప్రముఖ న్యాయవాదులు కామర్స్, కిరణ్మయి లను కార్యక్రమ నిర్వాహకులు ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో కండెల్లి ప్రసన్న, గడుసుల కామేశ్వరి, కొంగరపు గౌతమి, సుధారాణి, ముక్కామల మోహనరావు తదితరులు పాల్గొన్నారు.
