మంత్రి కందుల దుర్గేష్ చొరవతో నిడదవోలులో అదనంగా 8300 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలుకు చర్యలు

అడిగిన వెంటనే 50 శాతంకు పైగా ధాన్యం కొనుగోలుకు అవకాశమిచ్చిన మంత్రి నాదెండ్ల మనోహర్ కు కృతజ్ఞతలు తెలిపిన మంత్రి దుర్గేష్

నిడదవోలు నియోజకవర్గంలో అదనంగా మరో 8300 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయనున్నట్లు రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. అందులో భాగంగా ఉండ్రాజవరం మండలంలో 3800 మెట్రిక్ టన్నులు, నిడదవోలు మండలంలో 3500 మెట్రిక్ టన్నులు, పెరవలి మండలంలో 1000 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించనున్నట్లు పేర్కొన్నారు. అడిగిన వెంటనే 50 శాతంకు పైగా ధాన్యం కొనుగోలుకు అవకాశమిచ్చిన మంత్రి నాదెండ్ల మనోహర్ కు ఈ సందర్భంగా మంత్రి దుర్గేష్ కు కృతజ్ఞతలు తెలిపారు.

ఈ సందర్భంగా ధాన్యం కొనుగోలు వివరాలను మంత్రి దుర్గేష్ వెల్లడించారు. నిడదవోలు మండలంలో కోరుమామిడి-1లో 110 మెట్రిక్ టన్నులు, సింగవరంలో 400, తాళ్లపాలెంలో 180, డి.ముప్పవరంలో 200, పందలపర్రులో 400, కోరుపల్లిలో 150, అట్లపాడులో 200, విజ్జేశ్వరంలో 40, సమిశ్రగూడెం-2 లో 715, గోపవరంలో 30, కంసాలిపాలెంలో 200, పురుషోత్తపల్లిలో 80, సమిశ్రగూడెం-1లో 400,మునిపల్లిలో 75, శెట్టిపేటలో 200, రావిమెట్లలో 90, తాడిమళ్ల-2లో 30 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరిస్తున్నామని వివరించారు. పెరవలి మండలంలోని కానూరు-1లో 50, పిట్టల వేమవరంలో 100, నడుపల్లిలో 50, కాపవరంలో 150, మల్లేశ్వరంలో 50, పెరవలి-1లో 220, కానూరు అగ్రహారంలో 180, ముక్కామల-1లో 120, అజ్జరంలో 50, అన్నవరప్పాడులో 30 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించనున్నామని మంత్రి దుర్గేష్ తెలిపారు. ఉండ్రాజవరంలో మండలంలోని సత్యవాడలో 400, మోర్తలో 690, పసలపూడిలో 945, కాల్దారిలో 945, పాలంగిలో 60, వడ్లూరులో 140, వెలివెన్నులో 50,తాడిపర్రులో 60, ఉండ్రాజవరంలో 450, దమ్మెనులో 60 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేస్తామని మంత్రి కందుల దుర్గేష్ ఈ సందర్భంగా వెల్లడించారు.

గుంటూరు జిల్లా పర్యటనలో ఉన్న మంత్రి కందుల దుర్గేష్ ఈ విషయమై అధికారులతో మాట్లాడి రైతన్నలు ఆరుగాలం శ్రమించి పండిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని తెలిపారు. ఇచ్చిన మాట ప్రకారం మిగులు ధాన్యం కొనేందుకు చర్యలు తీసుకుంటామని రైతులకు చెప్పిన మంత్రి దుర్గేష్ సత్వరమే చర్యలు తీసుకోవడంపై రైతాంగం హర్షం వ్యక్తం చేస్తోంది. అంతేగాక మంత్రి దుర్గేష్ ఆదేశాలతో నేరుగా మిల్లర్లే ప్రభుత్వ ధరకు రైతుల వద్ద నుండి మిగులు ధాన్యం సేకరించేందేకు సుముఖత వ్యక్తం చేయడంపై యావత్ రైతాంగం మంత్రి దుర్గేష్ కు కృతజ్ఞతలు తెలిపారు.

Scroll to Top
Share via
Copy link