పర్యావరణాన్ని కాపాడుకునే బాధ్యత ప్రతి ఒక్కరు తీసుకోవాలి

ప్రతి ఒక్కరూ ఒక్కో మొక్క నాటేలా లక్ష్యం పెట్టుకోవాలి

తణుకులో ప్రారంభమైన కోటి మొక్కల వన మహోత్సవం

ప్రారంభించిన తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ

తణుకులో పది వేల మొక్కలు నాటాలని లక్ష్యం

పర్యావరణాన్ని కాపాడుకునే బాధ్యత ప్రతి ఒక్కరూ తీసుకోవాలని తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ కోరారు. ప్రతి ఒక్కరూ ఒక్కో మొక్క నాటేలా లక్ష్యంగా తీసుకోవాలని సూచించారు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన “కోటి మొక్కల వన మహోత్సవం” కార్యక్రమంలో భాగంగా గురువారం తణుకు మున్సిపాలిటీ ఆధ్వర్యంలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఎమ్మెల్యే రాధాకృష్ణ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు రాష్ట్రవ్యాప్తంగా కోటి మొక్కలు నాటే ఉద్యమాన్ని చేపట్టినట్లు చెప్పారు. ఇందులో భాగంగా తణుకు పట్టణంలో పదివేల మొక్కలు నాటేందుకు ప్రణాళికలు సిద్ధం చేసినట్లు వెల్లడించారు. పరిసరాలతో పాటు గాలి, నీరు స్వచ్చంగా ఉంటేనే ప్రతి ఒక్కరు ఆరోగ్యంగా ఉండగలమని అన్నారు. ఆరోగ్య ఆంధ్ర ప్రదేశ్ సాధించే లక్ష్యంతో రాష్ట్రంలో కోటి మొక్కలు నాటి పర్యావరణాన్ని కాపాడుకొనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు చెప్పారు. ఒక మొక్క నాటితే అదే మన కుటుంబాన్ని కాపాడుతుందని వెల్లడించారు. ప్రతి ఒక్కరూ తమ ఇంటి పరిసరాల్లో లేదా మరో ప్రదేశంలో ఆయన ఒక మొక్కను నాటే విధంగా లక్ష్యం పెట్టుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో తణుకు మున్సిపల్ కమిషనర్ టి.రామకుమార్, కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Scroll to Top
Share via
Copy link