రైస్ మిల్లర్లకు – రైతులకు మధ్య వారధిలా పనిచేయాలి

ఉండ్రాజవరం:
ఖరీఫ్ సీజన్ 2024 ధాన్యం సేకరణ విషయంలో రైస్ మిల్లర్లకు, రైతులకు మధ్య వారధిలా సిబ్బంది మంచి చేయాలని తహసీల్దార్ పి ఎన్ డి ప్రసాద్ సిబ్బందికి సూచించారు.  గురువారం ఉండ్రాజవరం వెలుగు కార్యాలయంలో ఆయన అధ్యక్షతన ధాన్యం సేకరణ విషయంపై నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా రానున్న ఖరీఫ్ సీజన్ ధాన్యం సేకరణకు సంబంధించి సిబ్బంది ముందస్తు చర్యలతో రైతులకు ఎటువంటి ఇబ్బంది కలుగకుండా చూడాలన్నారు. గోనె సంచులు మొదలుకొని, తేమ,  రవాణా, ప్లాస్టిక్ బరకాలు, వర్షాలు పడే అవకాశం ఉంటే జట్టు కూలీలను రెట్టింపు చేసుకోవాలని సూచించారు. నవంబర్ మొదటి తేదీ,  శుక్రవారం నుండి మండలంలో ధాన్యం సేకరణ ప్రారంభమవుతుందని వ్యవసాయ అధికారి ఎం.విశ్వాసరావు తెలిపారు.  ఈ కార్యక్రమంలో ఎంపీడీవో వి వి వి రామారావు, మండల వ్యవసాయ అధికారి ఎం.విశ్వాసరావు, సి ఎస్ డి టి ఎస్ ఎస్ సుధీర్ రెడ్డి, రైస్ మిల్లర్స్, వీఆర్వోలు, సొసైటీ కార్యదర్శులు, వ్యవసాయ శాఖ సిబ్బంది వీఆర్ఏలు, రైతులు పాల్గొన్నారు.

Scroll to Top
Share via
Copy link