రాజ్యాంగ దినోత్సవ సందర్బంగా తేతలి అంభేథ్కర్ యూత్ ఆధ్వర్యంలో అంభేథ్కర్ వారివిగ్రహానికి పూలమాలలువేసి నివాళులర్పించిన అనంతరం జరిగినసమావేశంలో నాయ్యవాది వాయిస్ ఆఫ్ దళిత్ వ్యవస్థాపకులు అరిగెలరాజేష్ మాట్లాడూతు రాజ్యాంగం రచించిన సమయంలో అంభేథ్కర్ ఎన్నోమానసిక ఒత్తిడికి లోనై తన ఆరోగ్యాన్ని కూడా లెక్కచేయకుండా 2సంవత్సరాల11నెలల18రోజులలో రాజ్యాంగాన్ని పూర్తిచేసి 1949 నవంబరు26వతేదిన బారతరాజ్యాంగ పరిషత్ కు అందించి పరిషత్ లో ఆమోదింపబడిన ఘనమైనరోజని అన్నారు. అంభేథ్కర్ అందించిన రాజ్యాంగమే ఈదేశానికి శరణ్యమని తెలిపారు. ఈకార్యక్రమంలో తేతలి అంబేద్కర్ యాత్, మద్దిల ఎసు, కేశరపెల్లి వెంకట్రావు, దిడ్ల రవి, గూటం సుబ్బారావు, సరేళ్ళ కృపవరం, కొట్టాల పలయ్య, గారపాటి రాజప్రతాప్, గారపాటి గోగులు, సబితి వరప్రసాద్, వందే చంద్రశేఖర్, బయ్య రాజేష్, గెడ్డం సూర్య చంద్రరావు, గంటి సుమంత్, గంటి సువర్ణ రాజ్, అంబేద్కర్ యూత్ సభ్యులు పాల్గొన్నారు.
