అత్తిలి ప్రభుత్వ జూనియర్ కళాశాలకు నూతన భవనం నిర్మాణం చేపట్టాలని తణుకు శాసనసభ్యులు ఆరిమిల్లి రాధాకృష్ణ ఇటీవల శాసనసభ సమావేశాలలో చర్చించిన సందర్భంగా ఏ ఐ ఎస్ ఏ. నాయకులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ మేరకు శుక్రవారం అత్తిలి ప్రభుత్వ జూనియర్ కళాశాల కూడలిలో .ఏ ఐ ఎస్ ఏ . సమావేశం జరిగింది ఈ సందర్భంగా. ఏ ఐ ఎస్ ఏ . జిల్లా కార్యదర్శి టి.అప్పలస్వామి మాట్లాడుతూ ఏళ్ల తరబడి అత్తిలి ప్రభుత్వ జూనియర్ కళాశాలకు సొంతభవనం మంజూరు చేయాలని విద్యార్థి సంఘాలు పలు ఉద్యమాలు చేపట్టినాయని కానీ అది పునాదులకే పరిమితమైందని దీనికి ఫలితం వచ్చిందని వారన్నారు. ఈ కళాశాలకు సొంత భవనం లేక విద్యార్థులు చాలా ఇబ్బందులకు గురి అవుతున్నారని కావున విద్యార్థులకు సొంతభవనం మంజూరు చేయాలని వారు డిమాండ్ చేశారు. శాసనసభ్యులు ఆరిమిల్లి రాధాకృష్ణ చొరవ తీసుకుని ఈ కళాశాలకు సొంత భవనం మంజూరయ్యే విధంగా మరింతకృషి చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో యు.రాణి , ఐ దివ్య , సిహెచ్ మనీషా , బి.మల్లేశ్వరి , పి.చరణ్ , ఎన్. రాజేష్ , యు. యశ్వంత్ తదితరులు పాల్గొన్నారు.
