.. ప్రేమించలేదని.. నోట్లో గుడ్డలు కుక్కి పెట్రోల్ పోసి కాల్స్ చంపిన ఉన్మాది- నిందితుడి పై కఠిన చర్యలు తీసుకుంటాం జిల్లా ఎస్పీ..
..తండ్రి లేని అనాధ.. తల్లి కష్టంతో చదువుకుంటూ జీవితంలో ఉన్నత ఆశయాలకు చేరుకోవాలని కష్టపడి ఇంటర్ మొదటి సంవత్సరం వరకు చదివిన ఓ బాలిక ఇంటర్ రెండు సంవత్సరం లో నేను నిన్ను ప్రేమించను.. నాకంటూ ఒక జీవితాశయం ఉంది. ప్రేమ దోమ జాంతానై.. అని చెప్పటంతో నాకు దక్కని నీవు ఈ లోకంలో ఉండకూడదు అంటూ ఓ ఉన్మాది నోటిలో బట్టలు కుక్కి పెట్రోల్ పోసి నిప్పంటించిన సంఘటన నంద్యాల జిల్లా నందికొట్కూరు పట్టణంలో జరిగింది. నంద్యాల జిల్లా ఎస్పీ అధి రాజ్ సింగ్ రాణా సంఘటన సంబంధించి ఎస్పీ తెలిపిన వివరాల మేరకు వెల్దుర్తి మండలం రామళ్లకోటకు చెందిన రామకృష్ణ అనే చేనేత కార్మికులతో నందికొట్కూరు కు చెందిన లక్ష్మితో వివాహమైంది. వీరికి లహరి అనే బాలిక జన్మించింది. రామకృష్ణ మరణించటంతో లక్ష్మి తన కూతురు లహరిని, నందికొట్కూర్ లోనే అవ్వ తాతల సమక్షంలో పెంచి చదివిస్తుంది. లహరి 10వ తరగతి వరకు వెల్దుర్తి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చదివింది. ఆ సమయంలోనే రాఘవేంద్ర పరిచయమవగా, ఆ సమయం నుంచి ప్రేమ అంటూ వెంటపడ్డాడు. పదోతరగతి పాసైన లహరిని నందికొట్కూరులోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ చదివిస్తూ ఉన్నారు అవ్వ తాత లు. చదువులో చురుకైన విద్యార్థిగా ఉన్న లహరి తన వెంట పడ్డ రాఘవేంద్రను నేను చదువుకొని కష్టపడి జీవితంలో స్థిరపడాలని అనుకుంటున్నానని నా తల్లి అవ్వ తాతల రుణం తీర్చుకోవాలని నా వెంట పడవద్దు.. ప్రేమ దోమ జాంతానై అని చెప్పేదని స్నేహితులు బంధువులు పేర్కొంటున్నారు. అవ్వ తాతలు కూడా రాఘవేంద్రను ఇంటి వద్దకు రావద్దని హెచ్చరించారు. రాఘవేంద్ర వినకుండా వెంటపడేవాడని సోమవారం తెల్లవారుజామున రాఘవేంద్ర పట్టణంలోని బైరెడ్డి నగర్ లో ఉన్న లహరి ఇంటికి వెళ్ళాడు. తన ప్రేమను వ్యక్తం చేశాడు. ఇద్దరి మధ్య ఘర్షణ వాతావరణం జరిగింది. ముందుగానే పథకం ప్రకారము పెట్రోల్ సీసాలతో వచ్చిన రాఘవేంద్ర లహరిని నోటిలో గుడ్డలు కుక్కి పెట్రోల్ పోసి తగలబెట్టాడు. ఈ ఘటనలో లహరి పూర్తిగా కాలిపోయింది. హహాకారాల మధ్య అక్కడికక్కడే చనిపోయింది. రాఘవేంద్ర తాను కూడా పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించాడు. ఈ అలజడికి మేల్కొన్న ప్రజలు రాఘవేంద్రను పట్టుకుని దేహశుద్దికి ప్రయత్నించారు. తప్పించుకొని ప్రభుత్వాసుపత్రిలో చేరాడు. పోలీసుల అతన్ని పట్టుకుని స్టేషన్కు తరలించారు. క్లూస్ టీం ద్వారా ఆధారాలను సేకరిస్తున్నట్టు జిల్లా ఎస్పీ తెలిపారు. తల్లి బంధువుల రోదనతో ఆ ప్రాంత ప్రజలు కన్నీటి పర్యంతమయ్యారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలని బంధువులు డిమాండ్ చేస్తున్నారు. డీఎస్పీ రామాంజి నాయక్ ఆధ్వర్యంలో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. నందికొట్కూరు ఎమ్మెల్యే గిత్త జయ సూర్య బాధిత కుటుంబాన్ని పరామర్శించి, నిందితునికి కఠిన శిక్ష పడేలా చేస్తామని తగిన న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.
