విశాఖ సౌత్ 35 వార్డ్ లో గల ప్రసాద్ గార్డెన్స్ వద్ద బుధవారం నిర్వహించిన రెవెన్యూ సదస్సులో ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ ఎన్డీఏ కూటమి నాయకులతో కలిసి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కులధ్రువీకరణ, ఆదాయం, నేటివిటీ సర్టిఫికెట్ లు, భూ సంబంధిత అంశాలపై సదస్సులో వివరించారు. ఈ సమావేశంలో స్థానిక ప్రజల రెవెన్యూ సమస్యలను వివరంగా తెలుసుకుని, వాటి పరిష్కారానికి చర్యలు తీసుకునేందుకు సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ సదస్సులో భూమి సమస్యలు, పథకాల అమలు మరియు గ్రామఅభివృద్ధి అంశాలపై ప్రత్యేక చర్చలు జరిగాయి. ప్రజల అవసరాలను శ్రద్ధగా పరిశీలించి, త్వరితగతిన పరిష్కారం కల్పించడానికి ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ తమ పూర్తి సహకారాన్ని అందిస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ అశోక్, జోనల్ కమిషనర్ నాయుడు, డిప్యూటీ తహశిల్దార్ జిలానీ, రెవెన్యూ సిబ్బంది, స్థానిక కార్పొరేటర్ భాస్కర్ రావు, మాజీ కార్పొరేటర్ ఆనంద్, స్థానిక కూటమి అధ్యక్షులు త్రినాధ్, రాము రెడ్డి, కూటమి శ్రేణులు రఘు, సతీష్, గుణ, రహమాన్, నగేష్, మంగా, కళావతి, అరుణ, సంద్య, ఆర్టీవో శ్రీను, రాము, నవీన్, చంద్ర ఆరు, శ్రవణ్, వల్లి రమణ, అశోక్, ప్రజలు పాల్గొన్నారు.
