రైతు సేవా కేంద్రాల ద్వారా ధాన్యమును మిల్లులకు తరలించి కోవాలి. రైతులకు సూచించిన జిల్లా జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి
ఇరగవరం మండలం కత్తవ పాడు, కంతేరు, రేలంగి, ఇరగవరం గ్రామాలలో మంగళవారం జిల్లా జాయింటు కలెక్టరు రాహుల్ కుమార్ రెడ్డి పర్యటించారు. కల్లల్లో ఆరబెట్టిన ధాన్యమును, కాటా వేస్తున్న వడ్ల బస్తాలను పరిశీలించారు. రైతులతో మాట్లాడారు 40.6 కేజీలు మాత్రమే తూకం చూపాలన్నారు. ఎక్కువ కాటా వేసి రైతులను నష్టపరచవద్దని సూచించారు. వాతావరణం మార్పులు ఉన్నందున రైతు సేవా కేంద్రాల ద్వారా ధాన్యమును మిల్లులకు తరలించాలని చెప్పారు. ఎట్టి పరిస్థితుల్లో దళారుల ద్వారా ధాన్యమును అమ్ముకోవద్దని అన్నారు. ప్రభుత్వం అమలు చేసిన దాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా కొనుగోలు చేసిన 48 గంటలలో డబ్బులు రైతుఖాతాలో జమగుచున్నవని అన్నారు. ఇబ్బందులు ఏమైనా ఉంటే సంబంధించిన అధికారుల ద్వారా పరిష్కరించుకోవాలని జిల్లా జాయింట్ కలెక్టర్ రైతులకు సూచించారు.
ఈ సందర్బంగా జిల్లా జాయింటు కలెక్టరు మాట్లాడుతూ రైతు సేవా కేంద్రాల ద్వారా వచ్చిన ధాన్యమును వెంటనే అన్లోడ్ చేసే విధంగా మిల్లర్లు సహకరించాలన్నారు. అవసరాన్ని బట్టి హమాలీలను అందుబాటులో ఉంచుకుని వాహనములు అన్లోడ్ చేయించిన వెంటనే పంపివేయాలని కస్టోడియన్ అధికారులను ఆదేశించారు. ఆరబెట్టిన ధాన్యములను మిల్లులకు తరలించేందుకు అధికారులు అన్ని చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. తగినన్ని గన్ని బ్యాగులు అందుబాటులో ఉంచాలని అన్నారు. దళారులను నమ్మిధాన్యం విక్రయించవద్దని రైతులకు సూచనలు ఇచ్చారు. రైతు సేవా కేంద్రాల్లో మద్దతుధరతో ధాన్యాన్ని విక్రయించుకోవాలని జిల్లా జాయింటు కలెక్టరు టి.రాహుల్ కుమార్ రెడ్డి కోరారు. ఈ సందర్భంలో తహసిల్దార్ సుందరరాజు, మండల వ్యవసాయశాఖ అధికారి వై. రాఘవేంద్రరావు, రైతు సేవ కేంద్రాల సిబ్బంది, రైతులు, తదితరులు పాల్గొన్నారు.
