మాల మహానాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు నన్నేటి పుష్పరాజ్ ఘాటువ్యాఖ్యలు
పశ్చిమగోదావరి జిల్లా పెనుమంట్ర మండలం వెలగలవారిపాలెం తాళ్లచెరువు నందు ఏర్పాటుచేసిన మాలమహానాడు సమావేశానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన మాలమహానాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు నన్నేటి పుష్పరాజ్ మాట్లాడుతూ ఉండి నియోజకవర్గం శాసనసభ్యులు రఘురామకృష్ణంరాజు అంబేద్కర్ ఫ్లెక్సీ చించివేయటం చాలా దారుణం అని దీనిపై రఘురాం కృష్ణంరాజు ఇప్పుడు వరకు కేసు నమోదు చేయకపోవడం క్షమాపణ చెప్పపోవడం చాలా దారుణం అని ప్రతి నియోజకవర్గంలో కార్యచరణ చేస్తున్నామని ఇకనైనా రఘురాం కృష్ణంరాజు పై చర్యలు తీసుకోకపోతే దళితులంతా ఏకమై రఘురామకృష్ణంరాజుకు తగిన బుద్ధి చెప్తామని పుష్పరాజ్ హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి చిల్లే రాజ్ కుమార్, కార్యదర్శి కోలాటి ప్రసాదరావు, రొక్కాల సతీష్, కాటుక అనిల్, పల్లి ఆనంద్, భావన మోషే, ఆచంట నియోజవర్గ కార్యదర్శి సాఖ బాబు రాజేంద్రప్రసాద్, తరపట్ల జోషి ,తదితరులు పాల్గొన్నారు
