ఉండ్రాజవరం మండల మానవత శాఖ ఆధ్వర్యంలో ఆదివారం పాలంగి గ్రామంలో మానవతా సంస్థ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మండలంలో అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్న నలుగురికి ఐదు వేల చొప్పున వైద్య ఖర్చుల నిమిత్తం మానవతా సంస్థ నుండి చెక్కులు మోర్త గ్రామానికి చెందిన 1. ఐసెట్టి ఏసుదాసు 2. కర్రీ రమణ 3. నెమళ్ళ లీలావతి 4. తాళం నాగమణి లకు మండల అధ్యక్షులు కటారి సిద్ధార్థ రాజు అందజేసినారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మానవతా సంస్థ ద్వారా అనారోగ్యంతో ఆర్థిక ఇబ్బందులు పడే వారికి ఈ సహాయాన్ని అందిస్తూ ఉంటామని ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో మానవతా మండల కమిటీ సభ్యులు తాతిన కృష్ణారావు వెలిచేటి బోసు, సంస్థ కార్యదర్శి ఫణితిని పార్వతి, సుంకవల్లి కోటేశ్వరరావు, రామకృష్ణ, విజయరాజు, ప్రసాదు తదితరులు పాల్గొన్నారు.
