ఉండ్రాజవరం మండలం తాడిపర్రు గ్రామంలో ఆదివారం బుద్ధిస్ట్ కౌన్సిల్ ఆఫ్ ఆంధ్ర ప్రదేశ్ కార్యాలయం ప్రారంభోత్సవం జరిగింది. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన కార్యక్రమంలో బుద్ధిస్ట్ కౌన్సిల్ ఆఫ్ ఆంధ్ర ప్రదేశ్ అధ్యక్షులు, ఉండ్రాజవరం బౌద్ధ ధమ్మ పీఠం నిర్వాహకులు పూజ్య గురువులు బంతే అనాలియో కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా తాడిపర్రు గ్రామ సర్పంచ్ కరుటూరి నరేంద్రబాబు విచ్చేశారు, ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాడిపర్రు గ్రామంలో బుద్ధిష్ట్ కౌన్సిల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కార్యాలయం ప్రారంభించడం తమ గ్రామానికి గర్వకారణమని, అదేవిధంగా పూజ్య బంతే అనాలయో ఆధ్వర్యంలో ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలు చేపట్టడం ద్వారా ఎందరికో ఆదర్శంగా నిలుస్తున్నారనిఅన్నారు. వివిధ ప్రాంతాల నుండి సభ్యులు విచ్చేశారు.
ఈ సందర్భంగా తాడిపర్రు గ్రామంలో ఏర్పాటు చేయబడ్డ బుద్ధిష్ట్ కౌన్సిల్ ఆఫ్ ఆంధ్ర ప్రదేశ్ కార్యాలయానికి కావలసిన ఫర్నిచర్, ఇతర సౌకర్యాలను కరుటూరి విజయ చౌదరి అందించారు.
ఈ కార్యక్రమంలో
బుద్ధిస్ట్ కౌన్సిల్ ఆఫ్ ఆంధ్ర అధ్యక్షులు పూజ్య భంతే అనాలయో, సెక్రటరి సి.హెచ్.సుబ్బారావు, డా.కె.వి.రమణ చిట్టూరి ఉషారాణి పరిసర గ్రామాల నుండి బౌద్ధాశ్రమ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
