వ్యవసాయ భూములకు సంబంధించిన రైతులకు రీ సర్వే పై అవగాహన కల్పించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, మండలంలో పైలెట్ ప్రాజెక్టు గ్రామంగా సత్యవాడ గ్రామాన్ని ఎంచుకున్నట్లు డిప్యూటీ తహాసిల్దార్ ఏ కనకదుర్గ సోమవారం తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రీ సర్వే ప్రాజెక్ట్ లో భాగంగా గ్రామంలో నిర్వహించిన అవగాహన ర్యాలీ లో ఆమె పాల్గొని, మాట్లాడారు. ఈ సందర్భంగా జనవరి రెండవ తేదీ గురువారం గ్రామ సచివాలయం లో గ్రామ సభ నిర్వహింపబడుతుందని చెప్పారు. రీ సర్వే నిర్వహించేందుకు మండలంలోని గ్రామ సర్వేయర్లు, వీఆర్వో లు, విఆర్ఎ లను 6 టీములుగా విభజించడం జరిగిందని తెలిపారు. ఒక్కొక్క టీం లో ఇద్దరు గ్రామ సర్వేయర్లు, 1 వీఆర్వో, 1 విఆర్ఎ లను నియమించారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, మండల సర్వేయర్ జి శ్రీనివాసరావు, రీ సర్వే డిప్యూటీ తహసీల్దార్ ఎం హరి ప్రసాద్, పంచాయతీ కార్యదర్శి జి ప్రసాదరావు, కమ్యూనిటీ సర్వేయర్ బి చాందిని, వీఆర్వో జె లక్ష్మీనరసమ్మ, గ్రామ సర్వేయర్ ఆర్ మారుతి శ్రీరామ్, విఆర్ఎ లు పాల్గొన్నారు.
