ముమ్మిడివరం
ముమ్మిడివరం మండలం కొత్తలంక గ్రామానికి చెందిన యువకుడు కేశనకుర్రు గోదావరి రేవులో ఈతకు దిగి గల్లంతు. కొత్తలంకకు చెందిన ముగ్గురు యువకులు సరదాగా గోదావరి చెంతకు వచ్చారు. వారిలో ఒక యువకుడు మంగ విజయ మణికంఠ (18) కేశనకుర్రు గోదావరి రేవులో ఈత కొట్టటానికి దిగి గల్లంతయ్యాడు. ఈ యువకులు ఓడలరేవు బి.వి.సి ఇంజినీరింగ్ కళాశాలలో ఇంజినీరింగ్ మొదటి సంవత్సర విద్యార్థులుగా సమాచారం. గల్లంతైన యువకుడి కోసం స్థానికులు, పొలీసులు గోదావరిలో గాలింపు చర్యలు చెప్పట్టారు ..