ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుని గురువారం తెలుగుదేశం పార్టీ రాష్ట్ర వాణిజ్య విభాగం అధికార ప్రతినిధి అత్తులూరి సుబ్బారావు ( సుబ్బు ) వెలగపూడి సచివాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతు రాష్ట్రంలో online వ్యాపారం వల్ల మధ్యతరగతి వ్యాపారస్తుల పరిస్థితి బాగాలేదని, దీనికితోడు
ప్రతి చిన్న ఊరిలో కూడా కార్పొరేట్ కంపెనీలు మాల్స్ (అనుమతి) రావడం వల్ల రెడీమేడ్, కిరాణా, క్లాత్, ఇలా ఎక్కువ శాతం మధ్యతరగతి వ్యాపారాలు దెబ్బ తింటున్నాయని ప్రభుత్వం తరుపున వ్యాపారస్తులకు తగుసూచనలు ఇవ్వాలని కోరుతు దీనికి తోడ్పడిన శాసనసభ్యులు డా. చదలవాడ అరవింద్ బాబుకు ధన్యవాదాలు తెలిపారు.
